అయితే ఏం. పర్వత శిఖరం వద్ద ఉన్న ఆ ఊరుకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఎవరూ పలకరించేవారు పని ఇచ్చేవారు లేరు. తిండికే గడవని పరిస్థితి. దీంతో వలసలు మొదలయ్యాయి. ఒకప్పుడు 1000 మంది ఉన్న ఆ ఊళ్లో ఇప్పుడు 84 మంది మిగిలారు. అది కూడా పనులుచేసుకొనే శక్తిలేనివాళ్లు. ఇప్పుడు జన్మించిన చిన్నారి పాబ్లో తల్లిదండ్రులు సిల్వియా, జో లు కూడా పాప పుట్టగానే వలస వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఊరు పెద్దలు వారిని బతిమిలాడి ఎలాగోలా ఉండేందుకు ఒప్పించారు. ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటి పట్టణాల కోసం ప్రత్యేకంగా ఏమైనా చేయాలని యోచిస్తోంది. ఇక్కడికి సమీపంలో మరో అందమైన పట్టణం ఉంది. అక్కడికి ఏటాఆరు లక్షలమంది టూరిస్టులు వస్తారు. అక్కడి జనాభా ఉండే ఇళ్లు మాత్రం కేవలం 6. అక్కడ గతంలో మూడు వేలమంది ఉండేవారు. ఇలా పర్వత ప్రాంతాల పట్టణాలది ఒక్కొక్కటీ ఓ దీనగాథ.
Mobile AppDownload and get updated news