ఈ ఏడాది తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించనున్న ఎంసెట్ పరీక్షకి రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 28 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనున్నట్టు తెలంగాణ సాంకేతిక విద్యా మండలి చైర్మన్ పాపి రెడ్డి మీడియాకి తెలిపారు. మార్చి 28వ తేదీతో దరఖాస్తుల స్వీకరణకి గడువు ముగియనుంది. మే 2న ఎంసెట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష నిర్వహణ కోసం 15 రీజినల్ సెంటర్స్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 3న ప్రాథమిక కీ విడుదల చేస్తామని పాపిరెడ్డి మీడియాకు వివరించారు.
కీలకమైన తేదీలు..
* ఫిబ్రవరి 25న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల. * ఫిబ్రవరి 28వ తేదీ ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. * మార్చి 28వ తేదీ దరఖాస్తుల స్వీకరణకి తుది గడువు. * మే 2న ఎంసెట్ పరీక్ష నిర్వహణ. * మే 3న ప్రాథమిక కీ విడుదల.
Mobile AppDownload and get updated news