Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85929

ప్రధానిని కాదు.. ప్రధాన సేవకుడిని

$
0
0

తాను దేశానికి ప్రధానమంత్రిని కాదని... భారతీయులకు ప్రధాన సేవకుడిని అని నరేంద్రమోడీ చెప్పారు. అధికార దర్పం ఒలకబోయడం కన్నా.. ప్రజలను సేవించుకోవడంలోనే తనకు ఆనందం ఉందని చెప్పారు. కర్నాటక రాష్ట్రంలోని బెళగావి ప్రాంతంలో శనివారం జరిగిన కిసాన్ ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. భారత ఆర్థిక రంగం చాలా పటిష్టంగా ఉందని, ప్రపంచం అంతా సంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి ఆటుపోట్లు తలెత్తలేదని ర్యాలీలో చేసిన కీలకోపన్యాసంలో చెప్పారు. వ్యవసాయం, తయారీరంగం, సేవల రంగాల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. వ్యవసాయం లేని భారతదేశాన్ని ఊహించలేమని, రైతుల సంక్షేమమే దేశ సంక్షేమం అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రధాన సేవకుడిగా ప్రజల సేవలో తరిస్తున్నానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో దేశమంతా అవినీతి మయంగా తయారయి పరిస్థితులు దారుణంగా ఉన్న తరుణంలో తాను దేశ పరిపాలన పగ్గాలు చేపట్టానన్నారు. దేశాభివృద్దిలో కీలకపాత్ర పోషించే వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నానని తెలిపారు. తక్కువ నీరు- అధిక సాగు అనేదే తమ ప్రభుత్వ నినాదమని.. ఆ దిశగా చేపట్టిన చర్యల ఫలితాలు ఇప్పుడిప్పుడే అందివస్తున్నాయన్నారు. రైతులు, పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి అంకితమై ఉన్నామని పునరుద్ఘాటించారు. వారితో పాటు యువతకు ఉపాథి కల్పనకోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని తెలిపారు. తాము తీసుకున్న చర్యల వల్లే ప్రస్తుతం మన దేశం ప్రపంచానికి ఆశాకిరణంగా అవతరించిందన్నారు.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85929

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>