బంగారు తెలంగాణా సాధనే తమ ధ్యేయమని... అందుకు అనుగుణంగానే బడ్జెట్ రూపకల్పన జరిగిందని టి.రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం ఉదయం 11.35 గంటలకు 2016-17 బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇంటి దగ్గర నుంచి శాసన సభకు బయలుదేరుతూ ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోకముందు తెలంగాణకు కనీసం పదివేల కోట్ల రూపాయలైనా ఇవ్వలేదని, అదే ఇప్పుడు కేవలం అభివృద్ధి కార్యక్రమాలకోసమే 40వేల కోట్ల రూపాయల నుంచి రూ.50వేల కోట్ల వరకు కేటయించామని తెలిపారు. బంగారు తెలంగాణగా మారుస్తామని అన్నారు. రాష్ట్రాన్ని సుసంపన్నం చేసే దిశగా బడ్జెట్ ఉందని చెప్పారు.
Mobile AppDownload and get updated news