ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై ప్రతిపక్ష పార్టీ వైకాపా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. వైకాపా ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం శాసనసభ కార్యదర్శిని కలిసి నోటీసు అందించారు. ఆ నోటీసులో పలువురు వైకాపా ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అంతకుముందు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది వైకాపా. సోమవారం దాదాపు ఎనిమిదిగంటల పాటూ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. చివరికి పెట్టిన ఓటింగ్ లో తీర్మానం వీగిపోయింది. ఇప్పుడు వైకాపా సభాపతిపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది.
Mobile AppDownload and get updated news