Mobile AppDownload and get updated news
రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్రరాష్ట్రంలో తలెత్తుకోలేని అధ్వాన పరిస్థితిలోకి వెళ్లింది కాంగ్రెస్. ఒక్క సీటు కూడా గెలుచుకోలేక... తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏపీ ప్రత్యేక హోదాని తెచ్చిపెట్టి... మళ్లీ రాష్ట్రంలో తలెత్తుకు తిరగాలని ప్రయత్నిస్తోంది. ప్రజల ఆదరాభిమానాలను సంపాదించి పూర్వవైభవాన్ని పొందాలని తనవంతు కృషి చేస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం ఆపరాదని ప్రకటించారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి 300 మందితో కొన్ని రోజుల క్రితం ఢిల్లీ చేరిన సంగతి తెలిసిందే. తనతో పాటూ 13 జిల్లాల మట్టి, నీళ్లని కూడా తీసుకెళ్లారు. అలాగే కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు. మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా సంతకాలు చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా సాధించే విషయంలో కాంగ్రెస్ చేస్తున్న కృషి వృథా కాదని అన్నారు.