Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85939

రూ.81 ఇచ్చి పండగ చేస్కోమన్నారు

$
0
0

అదేదో సినిమాలో ఒక కమెడియన్ ఒక బిక్షగాడి చేతికి పావలా ఇచ్చి పండగ చేసుకో పో అంటాడు. ఆ పావలా చూసి అవాక్కయిన బిక్షగాడు కమేడియన్ ను ఎగాదిగా చూసి.. ఏ పండగ చేసుకోవాలో నువ్వే చెప్పమంటాడు.. చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం తీరు కూడా ఇలాగే ఉంది. ఇటీవల చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం తన రాష్ట్రంలోని కరవు కాటకాలు, అతివృష్టి లాంటి కారణాల వల్ల పంటను నష్టపోయిన రైతులకు పంటనష్టం కింద పరిహారాన్ని అందచేసింది. ఆ పరిహారపు మొత్తాన్ని చెక్కుల రూపేణా రైతులకు అందచేసింది. ఎంతో ఆశగా ఆ చెక్కులను అందుకున్న రైతుల ముఖాల్లో నెత్తురుచుక్క మాయమై తెల్లబోయాయి. రూ. లక్ష రూపాయిల పంట నష్టానికి గాను ఒక రైతుకు ప్రభుత్వం చెల్లించిన పరిహారం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.81 మాత్రమే. ఈ 81 రూపాయిలతో తాను అప్పుతీర్చాలా లేక ఉరివేసుకు చావాలా అని ఆ రైతు కళ్లనీళ్లతో ప్రశ్నించాడు. ఆ రైతు సుర్గుజా జిల్లాకు చెందిన వాడు. అతనికి కలిగిన పంట నష్టం రూ. లక్ష అని లెక్కలేసిన జిల్లా యంత్రాంగం పరిహారం కింద రూ.81 చెక్కు రూపంలో పంపి చేతులు దులుపుకుంది. ఇలా చెక్కులను అందుకున్నది అతగాడొక్కడే కాదు. అతనితోపాటు అలాంటి రైతుల సంఖ్య వందల్లోనే ఉంది. ఒక రైతుకు రూ.100, ఇంకొకతని రూ.300 ఇలా పంపిణీ అయింది. ఆ రాష్ట్రంలో అత్యధికమొత్తంలో పంపిణీ అయిన పరిహారం ఎంతో తెలుసా? రూ. 1000 అన్నమాట. కాగా ఈ అంశంపై అక్కడి విపక్షాలు భగ్గుమన్నాయి. అసలు ఏ ప్రాతిపదికన రైతులకు నష్టపరిహారాన్ని లెక్కగట్టి పంపిణీ చేసారంటూ నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85939

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>