ఢిల్లీ: విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పిన నేపథ్యంలో ఏపీ ప్రజల కోపాన్ని చల్లార్చే ప్రయత్నంలో భాగంగా జైట్లీ ఏపీ అంశాన్ని సభలో ప్రస్తావించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా దక్కకపోయినప్పటికీ ఆర్ధిక సాయం మాత్రం తప్పకుండా అందుతుందన్నారు. ఏపీ అందాల్సిన ప్రతి పైసాను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏపీ రెవెన్యూ లోటు భర్తీ విషయం నుంచి రాజధాని నిర్మాణం వరకు కేంద్రమే చూసుకుంటుందన్నారు. రెవెన్యూ లోటు భర్తీ ప్రక్రియలో భాగంగా తొలి ఏడాది ఏపీకి 2 వేల కోట్లు కోటాయించామని.. రాజధాని కోసం కూడా నిధులు సమకూర్చుతున్నామన్నారు. అలాగే పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా కేంద్రానిదేనని వెల్లడించారు.
Mobile AppDownload and get updated news