బాలీవుడ్ హీరోయిన్ జియాఖాన్ ఆత్మహత్య కేసు మళ్లీ సూరజ్ పంచోలీకి చుట్టుకుంటోంది. ఆ కేసుపై ముంబై సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. జియా తల్లి వేసిన పిటిషన్ పై విచారణ సాగింది. జియా తల్లి తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్పనా హైర్ వాదించారు. ఆమె తన వాదనలో సూరజ్ పై మొత్తం మూడు సెక్షన్లలో కేసు నమోదు చేయాలని కోరారు. ఐపీసీ 302 కింద హత్యానేరం, 313 కింద మహిళకు ఇష్టం లేకుండా అబార్షన్ చేయించడం, 376 కింద అత్యాచారం కేసులను నమోదు చేయాలని వాదించారు. అందుకు సూరజ్ తరుపు న్యాయవాది ఎలాంటి ఆధారం లేకుండా హత్యానేరం ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. కేసును వాదన మే 20 తేదీకి వాయిదా పడింది. ఆ రోజున సూరజ్ పై హత్యానేరం కింద కేసు బుక్ చేయాలో వద్దో తీర్పునిస్తారు.
Mobile AppDownload and get updated news