ఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురి రాజ్యసభ స్థానాలకు పదవీకాలం ముగుస్తునందున ఎన్నికల నిర్వహణ సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతుండగా..తెలంగాణలో రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అంటే మొత్తం ఆరుస్థానాలకు జూన్ 11 న ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడవు మే 31 గా ఈసీ నిర్ణయించింది. ఏపీ నుంచి జేడీశీలం, జైరాం రమేష్, సుజనాచౌదరి, నిర్మలా సీతారామన్ పదవీకాలం ముగియనుంది. అలాగే తెలంగాణ విషయానికి వస్తే.. గుండు సుధారాణి, వి.హనుమంతరావు పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. దీంతో ఈ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది.
Mobile AppDownload and get updated news