మే 15వ తేదీకే దాదాపు 5.5 కోట్ల మంది భక్తులు క్షిప్రా నదిలో సింహస్త స్నానం ఆచరించినట్టు ఇంఛార్జ్ మినిష్టర్ భూపేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు.
నెల మొత్తం కలిపి దాదాపు 5 కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తారని అంచనా వేశాం. కానీ అనుకున్నదానికన్నా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు కనుక మేళా ముగిసేలోపు ఆ సంఖ్య 7 కోట్లకి చేరుకుంటందని అంచనా వేస్తున్నాం అని సింగ్ అభిప్రాయపడ్డారు.
హిందువులు పవిత్రంగా భావించే ఈ ఘట్టం కోసం కేంద్రం అందించే ఆర్థిక సహాయంతో కలిపి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.3,600 కోట్లు వెచ్చించి భక్తుల కోసం ఏర్పాట్లు చేసింది.
Mobile AppDownload and get updated news