Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 86017

వారి 'వాతావరణం' బాలేదు

$
0
0

వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో చైనా విమాన ప్రయాణికులు గంటల తరబడి ఇండియాలో చిక్కుకుపోయి చుక్కలు చూసారు. దక్షిణ చైనా ఎయిర్ లైన్స్ విమానంలో 125మంది ప్రయాణికులు ఆ దేశంలోని గువాన్గ్జూ బయాన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నుండి ఢిల్లీకి బయలుదేరారు. భారతదేశ గగనతలంలోకి వారి విమానం ప్రవేశించిన కొద్దిసేపటికి ఆకాశంలో వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. దాంతో విమానం ఆకాశంలో ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో విమాన పైలట్ ఆ విమానాన్ని ముంబైకు దారిమళ్లించాల్సి వచ్చింది. ముంబైలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానాన్ని దింపారు. అనంతరం పైకి కదిలే పరిస్థితులు లేకపోవడంతో ప్రయాణికులంతా అక్కడే చిక్కుబడిపోయారు. 24 గంటలకు పైగా వారు ఆ విమానాశ్రయంలో తిండితిప్పలు లేక అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 86017

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>