ఈ ప్రభుత్వం ప్రకటనల లోకంలో మాత్రమే జీవిస్తుంటుంది. ఆర్థిక వ్యవస్థకు జవజీవాలివ్వడంలో పూర్తిగా విఫలమైంది. రూపాయి విలువ దిగజారిపోతోంది. ద్రవ్యోల్బణం రేటు పెచ్చుమీరిపోతోంది.. ఉద్యోగాల కల్పనలో దిగజారిపోయింది, అన్నారు. సంవత్సరానికి పదికోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామని మోడీ హామీ ఇచ్చారు. కానీ లక్షల్లో కూడా అది సాధ్యం కాలేదని మండిపడ్డారు. ఈ రెండేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం సాధించిన అతి పెద్ద లక్ష్యాలు ఏమిటయ్యా అంటే.. అవి సామాజిక ఉద్రిక్తతలు, బీజేపీ నేతల రెచ్చగొట్టుడు ప్రకటనలు, కుల మతాలుగా దేశాన్ని విడదీసి వాటి మధ్య అనవసరమైన వివాదాలు మాత్రమేన్నారు.
Mobile AppDownload and get updated news