Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85919

ప్రత్యేక పాటల మహారాణి... జ్యోతిలక్ష్మి

$
0
0

ఆమె వేసినవి వ్యాంప్ క్యారెక్టర్లే కావచ్చు, శృంగార భరిత పాటలకు స్టెప్పులే కావచ్చు... కానీ వాటికి ఉన్న క్రేజ్ అప్పట్లో అంతా ఇంతా కాదు. సినిమాలో ఆమె పాట ఉందంటే చాలు... థియేటర్లకి క్యూ కట్టే వాళ్లు కుర్రకారు. ఆమె రేంజ్ ఎంతలా పెరిగిందంటే... అవసరం ఉన్నా లేకున్నా... సినిమాలో ఆమె పాటను మధ్యలో చొప్పించే దర్శక నిర్మాతలే ఎక్కువప్పుడు. అంతగా ... ప్రత్యేక పాటల ప్రపంచాన్ని ఏలిన మహారాణి జ్యోతి లక్ష్మి. అర్థాంతరంగా లోకాన్ని వీడి వెళ్లిపోయారు. వారం రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతూ ఆరోగ్యం విషమించి మరణించారు.

జ్యోతి లక్ష్మి తమిళ అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు. తల్లి శాంభవి, తండ్రి రామరాజన్. తంజావూరు జిల్లా స్వస్థలం. తండ్రి సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. వినాయక ప్రొడక్షన్స్ లో భాగస్వామి కూడా. ఇక తండ్రి చెల్లెలు ధనలక్ష్మి కూడా నటే. ఆమె దగ్గరే జ్యోతి లక్ష్మిని ఉంచారు తల్లిదండ్రులు. తమిళ దర్శకుడు టీఆర్ రామన్ మేనమామ అవుతారు. పూర్తిగా సినీ కుటుంబంలోనే జన్మించిందని చెప్పాలి జ్యోతి లక్ష్మి. చిన్నప్పట్నించే భరత నాట్యం శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. ఎనిమిది సంతానంలో జ్యోతి లక్ష్మే పెద్దవారు. అయిదేళ్ల వయసులోనే మేనమామ రామన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది జ్యోతి లక్ష్మికి. ఎంజీఆర్, శివాజీ గణేశన్ నటించిన 'గూండు కిళి' సినిమాలో తొలిసారి నాట్యం చేసింది. ఆ తరువాత ఎనిమిదేళ్ల వయసులో శివాజీ గణేశన్ సినిమాలో నర్తించింది. ఆమెకు గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం 1963లో విడుదలైన తమిళ చిత్రం పెరియ ఇడత్తుపెన్. ఇందులో ఆమె చేసిన నాట్యానికి అందరూ ముగ్ధులయ్యారు. అంతేకాదు ప్రముఖ కామెడీ నటుడు నగేష్ సరసన జోడీగా నటించింది. అప్పుడామె వయసు కేవలం 12 ఏళ్లు. నాట్యగత్తెగా, కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె... ఐటం బాంబ్ గా ఎలా మారారు?



జ్యోతి లక్ష్మి హిందీలో కూడా నటించారు. కిషోర్ కుమార్ పక్కన హీరోయన్ గా 'పాయల్ కి ఝన్కార్' అనే సినిమాలో చేశారు. అది సూపర్ హిట్ కొట్టింది. అలా తెలుగు, మళయాళంలో కూడా అవకాశాలు వచ్చాయి. తెలుగులో 1967లో పెద్దక్కయ్య సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలోనే హరనాథ్ గారితో కలసి ఓ పాటకి నర్తించారు. ఆ పాట అప్పట్లో చాలా పాపులర్ అయ్యింది. దీంతో ప్రత్యేక పాటల్లో నర్తించమంటూ ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి.1971లో ఏఎన్నార్ హీరోగా చేసిన ఈ సినిమాలో 'లే లే నా రాజా' పాటతో ఆమె తెలుగు ప్రజల మనసుల్లో చెరిగిపోని ముద్రవేసుకుంది. ఇక అక్కణ్నించి ఆమె ప్రత్యేక గీతాల హీరోయిన్ గా మారిపోయింది. 1973లో ఇదా లోకం సినిమాలోని 'గుడి వెనుక నా సామి' పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. సర్ధార్ పాపారాయుడులో 'జ్యోతి లక్ష్మి చీరకట్టింది' అంటూ ఆమెపైనే పాట రాసి, షూట్ చేశారు. ఆ పాట్ ఎంతగా హిట్ కొట్టిందంటే... ఇప్పటికీ ఆ పాట నోళ్లపై నానుతూనే ఉంటుంది.

జ్యోతిలక్ష్మి ప్రేమ పెళ్లి చేసుకుంది. 80వ దశకంలో కెమెరామెన్ సాయిప్రసాద్‌ని ఇంటి నుంచి పారిపోయి ముంబైలో పెళ్లి చేసుకున్నారు. ఆమెకి ఓ అమ్మాయి జ్యోతి మీనా ఉన్నారు. ఆమె కూడా కొన్ని సినిమాల్లో నటించారు.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85919

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>