Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 86095

సింగూరు భూములపై సుప్రీం తీర్పు

$
0
0

నానో కార్ల కంపెనీ కోసం పశ్చిమ బంగలో టాటా గ్రూపునకు కేటాయించిన 1000 ఎకరాల భూములపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. పది వారాల్లో భూములు కోల్పోయిన రైతులకు భూములు కేటాయించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. 2006 అప్పటి నుంచి సీపీఎం ప్రభుత్వం టాటా సంస్థకు 1000ఎకరాలు కేటాయించింది. దీనిపై అప్పటి ప్రధాన ప్రతిపక్షం తృణమూల్ కాంగ్రెస్ భూములు కోల్పోయిన రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసిన చేసింది. సింగూర్, నందిగ్రామ్ లలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరిట రైతుల నుంచి భూములు లాక్కొని ప్రభుత్వం బహుళ జాతి కంపెనీలకు అప్పగించిందని మమతా బెనర్జీ ఉద్యమించారు. సింగూర్ భూ కేటాయింపును నిరసిస్తూ చేసిన పోరాటంలో అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. 'అక్రమ పద్ధతిలో రైతుల దగ్గర భూములు లాక్కొని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టం చట్టవ్యతిరేకం' అంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో బాధిత రైతులు, రైతు కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి.



న్యాయం తమవైపు ఉన్నది. ఇదే సుప్రీం కూడా ఆమోదించింది. అని వారు ఆనందం వ్యక్తం చేశారు. తమ పక్షాన నిలబడ్డ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ధన్యవాదాలు తెలిపారు. 2011లో అధికారంలోకి వచ్చిన వెంటనే మమతా బెనర్జీ సింగూరు భూములను టాటా గ్రూపునకు కట్టబెట్టడాన్ని రద్దు చేస్తూ చట్టం చేశారు. దీంతో టాటా గ్రూపు తన నానో కార్ల కంపెనీ స్థాపన కోసం గుజరాత్ తరలివెళ్లింది. టాటా గ్రూపు పశ్చిమ బంగ హైకోర్టు ఆతరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 86095

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>