ఆందోళనకారులు ప్రాణాలు విడిచారు. కేంద్ర పెద్దల చర్చల అనంతరం పరిస్థితుల తీవ్రత తగ్గుముఖం పట్టిందని అందరూ భావించారు. అయితే ఇది తాత్కాలికమేనని తేలిపోయింది. వేడి వాతావరణం చల్లబడిందని భావించిన ప్రభుత్వం.. రెండు రోజుల పాటు భద్రతా బలగాలను కూడా తగ్గించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆందోళన కారులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ లో కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించినప్పటికీ లెక్కచేయకుండా ఆందోళన కారులు రెచ్చిపోయారు. రోడ్లపై వచ్చి భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపుచేసే క్రమంలో భద్రతా దళాలు ఆందోళన కారులుపై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా మరి కొందరు గాయాల పాలయ్యారు. కాగా ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు.కాగా ఇప్పటి వరకు ఈ అల్లర్ల లో మృతుల సంఖ్య 80కి చేరింది. గాయపడిన వారి సంఖ్య 10వేలకు చేరినట్లు అధికారులు పేర్కొన్నారు.
Mobile AppDownload and get updated news