ఆది హీరోగా తెరకెక్కిన రఫ్ మూవీతో కమెర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సీ.హెచ్. సుబ్బా రెడ్డి తాజాగా డైరెక్ట్ చేస్తున్న చిత్రం 'రుద్రాక్ష'. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రముఖ హీరోలతోపాటు ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు డైరెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. సీ.వీ. రెడ్డి సమర్పణలో 24 క్రాఫ్ట్స్ బ్యానర్పై రూపొందనున్న ఈ మల్టీస్టారర్ మూవీని అద్దంకి రవికాంత్ నిర్మిస్తున్నారు. త్వరలోనే నటీనటుల పేర్లు ప్రకటిస్తామని దర్శకుడు సుబ్బా రెడ్డి మీడియాకు వివరించారు.
Mobile AppDownload and get updated news