బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కుప్పకూలడం వెనక కుట్రజరిగిందని కేంద్ర మంత్రి ఉమా భారతి అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో కొందరు పనిగట్టుకుని బీఫ్ అంశాన్ని, అసహనానికి నిరసనగా అవార్డుల వాపసు అంశాన్ని తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడమే ఓటమికి కారణంగా ఉమా భారతి విశ్లేషించారు. బీహార్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టకుండా ప్రణాళిక ప్రకారం ప్రత్యర్థులు కృషి చేసి విజయం సాధించారన్నారు. పార్టీలోని కొందరు నేతల తీరు పట్ల కూడా ఆమె తీవ్రంగా స్పందించినట్లు చెపుతున్నారు.
Mobile AppDownload and get updated news