భారత దేశంలో 2001- 02 ఏడాదిలో 16.5 మిలియన్ హెక్టార్ల భూమిలో 145.8 మిలియన్ టన్నుల పండ్లు ఉత్పత్తి కాగా..2014-15 వచ్చే సరికి 23.4 మిలియన్ల హెక్టార్లు భూమిలో 283.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసినట్లు తేలింది. ఇదిలా ఉండగా భారత్ లో ఉత్పత్తి చేసిన పండ్లలో అత్యధికంగా ద్రాక్ష (107.3 మిలియన్ టన్నులు) ఎగుమతి చేసినట్లు నివేదికలో వెల్లడైంది. ఆ తర్వాతి స్థానంలో అరటికాయ, మామిడిపండ్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా భారత్ లో హార్టి కల్చర్ అభివృద్ధిలో ప్రధాన పట్టణాల కంటే చిన్న పట్టణాలే ముందున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ ఓ ప్రకటన తెలిపింది. ఉత్పత్తుల్లో చైనాకు ధీటుగా ఎదుర్కొవాలంటే గ్రీన్ రివల్యూషన్ ఉద్యమాన్ని మరింత ఉధతం చేయాల్సిన అవసరముందుని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉత్పత్తిలో ఏపీకి రెండో స్థానం...
పండ్ల ఉత్పత్తిని రాష్ట్రాల వారీగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. అత్యధిక ఉత్పత్తిని నమోదూ చేస్తూ మహారాష్ట్ర ఏపీని వెనక్కి నెట్టేసింది. గుజరాత్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, కర్నాటక మరియు మధ్యప్రదేశ్ లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మామిడి, నిమ్మకాయల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ టాప్ పొజిషన్ లో ఉంది. అరటికాయ ఉత్పత్తుల్లో తమిళనాడు, యాపిల్ ఉత్పత్తిలో జమ్మూకశ్మీర్ టాప్ పొజిషన్ లో నిలిచింది. అలాగే జామ కాయ ఉత్పత్తిలో మధ్య ప్రదేశ్ రాష్ట్రం టాప్ పొజిషన్ లో ఉంది.
Mobile AppDownload and get updated news