నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన రహస్య షైళ్లను శనివారం ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. సుభాష్ చంద్రబోస్ కుటుంబసభ్యుల సమక్షంలో ఎన్ఏఐలో పత్రాలు విడుదల చేశారు. నేతాజీ జన్మదినం సందర్భంగా ఈ ఫైళ్లను ఆయన విడుదల చేశారు. అంతకు ముందు ఆయన ఢిల్లీలో నేతాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరంనేతాజీ జీవితానికి సంబంధించిన 100 రహస్య దస్త్రాలను డిజిటల్ ప్రతుల రూపంలో బహిర్గతం చేశారు. ఈ కార్యక్రమానికి 12 మంది నేతాజీ కుటుంబసభ్యులు హాజరయ్యారు. నేతాజీ మరణంపై గతంలో వేసిన రెండు దర్యాప్తు కమిషన్లు ఆయన తైపీలో 1945, ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు తెలిపాయి. కానీ ఆయన కుటుంబసభ్యులు, మరికొందరు ఈ విషయాన్ని అంగీకరించలేదు. ఆయన గురించి పూర్తి సమాచారం కోసం రహస్య షైళ్లను బహిర్గతం చేయాలని అడిగారు.
Mobile AppDownload and get updated news