Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all 86433 articles
Browse latest View live

జనవరి 8 బుధవారం.. ములుగు పంచాంగం

$
0
0
శుభకార్యాలు, పండగలు, వ్రతాలు లాంటి వాటి విషయానికి వస్తే భారతీయులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం. ఇది దుర్ముహూర్తాలు, శుభముహూర్తాలు, వర్జ్యాలు, రాహుకాలం, సూర్యోదయం లాంటి విషయాల గురించి తెలియజేస్తుంది. పంచాంగం కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ప్రస్తుతం మాత్రం రెండు విధానాలే అమల్లో ఉన్నాయి. అవి సూర్యమానం', చంద్రమానం'. చంద్రుని సంచరణతో అనుసంధానమైంది చాంద్రమాన పంచాగం, సూర్యుని సంచరణతో అనుసంధానమైంది సూర్యమాన పంచాంగం. తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. కాబట్టి చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది ఛైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తవుతుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వివిధ జ్యోతిషశ్శాస్త్ర నిపుణులు పంచాంగాలు మార్కెట్‌లో లభించినా, ములుగు సిద్ధాంతిగారి పంచాంగానికి ఓ ప్రత్యేకత ఉంది. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారి పంచాంగంలో తిథి, వార, వర్జ్యాలు, శుభమూహూర్త, దుర్ముహూర్తాల గురించి సరైన సమాచారం ఉంటుంది. గ్రెగేరియన్ క్యాలెండర్‌తోపాటు చంద్రమానం అనుసరించి రోజువారీ, నెలవారీ, వార్షిక పంచాంగాన్ని రూపొందిస్తారు. ములుగు వారి జనవరి 8 బుధవారం పంచాంగం.
తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జనవరి 8 సౌమ్యవాసరే ఉదయం 6.37- సాయంత్రం 5.37
Read Also:
సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంత రుతువు పుష్యమాసం-శుక్ల పక్షం శుక్లం రాత్రి 8.52 వరకు తదుపరి బ్రహ్మం- కౌలువ మధ్యాహ్నం 2.23 వరకు తదుపరి తైతుల రాత్రి 2.28 వరకు ఆ తదుపరి గరజి త్రయోదశి రాత్రి 3.43 వరకు తదుపరి చతుర్దశి
నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
రోహిణి మధ్యాహ్నం 3.37 వరకు తదుపరి మృగశిర ఉదయం 7.42 నుంచి 9.19 వరకు తిరిగి రాత్రి 9.24 నుంచి 10.39 వరకు ఉదయం 11.51 నుంచి 12.36 వరకు మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు ఉదయం 11.32 నుంచి 1.12 వరకు తెల్లవారి 6.21 నుంచి ఉదయం 7.00 నుంచి 7.20 తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00

చిత్తూరు: బస్సులు ఢీ.. ఇద్దరు మృతి, 25మందికిి గాయాలు

$
0
0
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట రూట్‌లో కాశిపెంట్ల దగ్గర వేకువజామున ఆర్టీసీ అమరావతి ఓల్వో బస్సు-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. 25మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. వోల్వో బస్సు విజయవాడ నుంచి కుప్పం వెళ్తుండగా.. ట్రావెల్స్ బస్సు అయ్యప్ప భక్తుల బృందంతో శబరిమల నుంచి నల్గొండకు వెళుతోంది. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగ్గా.. బస్సులో ఇరుక్కున్న క్షతగాత్రులను బయటికి తీయడానికి గ్యాస్ కట్టర్‌తో బస్సులను కట్ చేశారు. రెండు బస్సులు ఢీకొట్టడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రమాదంతో అక్కడ భయానక వాతావరణం కనిపించింది.

యష్ బర్త్‌డే గిఫ్ట్.. అదరగొడుతున్న కేజీఎఫ్‌ 2 సెకండ్‌ లుక్‌

$
0
0
బాహుబలి తరువాత ఆ స్థాయిలో నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సౌత్ సినిమా కేజీఎఫ్‌. సాండల్‌వుడ్‌ యంగ్ హీరో హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఘన విజయం సాధించి కన్నడ సినిమా స్థాయిని, మార్కెట్‌ను పెంచింది. ప్రస్తుతం ఈ సూపర్‌ హిట్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగం సూపర్‌ హిట్‌ కావటంతో సీక్వెల్‌ను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో యష్‌కు ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ సీనియర్‌ హీరోగా నటిస్తుండటం విశేషం. ఇప్పటికే సంజయ్‌ దత్‌కు సంబంధించిన ప్రీ లుక్‌తో పాటు యష్‌ లుక్‌ను కూడా రివీల్ చేశారు చిత్రయూనిట్. Also Read: తాజాగా యష్‌ పుట్టిన రోజు సందర్భంగా సెకండ్‌ లుక్‌ రిలీజ్‌ అయ్యింది. 90ల నాటి స్టైలింగ్‌లో చేతిలో ఆయుదంతో అగ్రెసివ్‌గా కనిపిస్తున్న యష్‌ లుక్‌ సూపర్బ్ అనిపించేలా ఉంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కొంత భాగం షూటింగ్‌ కేజీఎఫ్‌ చాప్టర్‌ 1 తెరకెక్కిస్తున్న సమయంలో పూర్తి చేశారు. యష్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రవీనా టండన్‌, అనంత్‌ నాగ్‌, మాళవికా అవినాష్‌, అచ్యుతకుమార్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తొలి భాగానికి అద్బుతమైన పాటలతో పాటు నేపథ్య సంగీతం అందించిన రవి బసూర్‌ ఈ సినిమాకు కూడా సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 వేసవిలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. Also Read:

Today Petrol Price: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. భగ్గుమన్న ముడిచమురు!

$
0
0
దేశీ ఇంధన ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో హైదరాబాద్‌లో బుధవారం లీటరు రూ.80.54 వద్దనే స్థిరంగా కొనసాగింది. కూడా రూ.75.00 వద్దనే నిలకడగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.80.07 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర కూడా రూ.74.19 వద్దనే నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.79.70 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.73.85 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.75.74 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.68.79 వద్ద నిలకడగా కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.81.33 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.72.14 వద్ద నిలకడగా కొనసాగుతోంది. Also Read: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 2.39 శాతం పెరుగుదలతో 69.93 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 2.23 శాతం పెరుగుదలతో 64.09 డాలర్లకు ఎగసింది. Also Read: ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు. Also Read:

హోటల్‌ రూమ్‌లో ఎస్‌బీఐ ఉద్యోగిని ఆత్మహత్య.. కర్నూలులో కలకలం

$
0
0
నగరంలో బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.. శిరువెళ్ల మండలం ఎర్రగుంట్లలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరమ్మ(34) కర్నూలు ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ హోటల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త శేఖర్‌ పంచాయతీరాజ్‌ శాఖలో సచివాలయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం నంద్యాలలోని వీసీ కాలనీలో నివాసముంటోంది. Also Read: కొద్దిరోజులుగా సెలవులో ఉన్న ఆమె సోమవారం బ్యాంకుకు వెళ్లి కనిపించకుండా పోయారు. సోమవారం రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి బాల వెంకటస్వామి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆయన శిరువెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసలు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో వెంకటేశ్వరమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకున్న కర్నూలు నాలుగో పట్టణ ఎస్సై పెద్దయ్యనాయుడు మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యులను విచారించారు. Also Read: గదిలో పురుగుల మందు డబ్బా ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె సోమవారం రాత్రి కర్నూలు చేరుకుని హోటల్‌లో రూమ్ తీసుకున్నట్లు గుర్తించారు. వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి సంబంధించి ఆళ్లగడ్డకు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. Also Read:

నిర్భయ దోషులకు ఉరి: బక్సార్ జైలు నుంచి తాళ్లు.. మీరట్ నుంచి తలారి

$
0
0
దేశ రాజధాని ఢిల్లీలో ఏడేళ్ల కిందట కదులుతున్న బస్సులో అత్యంత పాశవికంగా నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన ఆమె మరణానికి కారకులైన నలుగురు దోషులకు జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరితీయనున్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో నిర్భయ దోషులకు కూడా తక్షణమే ఉరి శిక్ష అమలుచేసి ఆమెకు న్యాయం చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినబడింది. ఈ నేపథ్యంలో దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాజాగా, మంగళవారం ఢిల్లీ న్యాయస్థానం డెత్ వారెంట్ చేసింది. దీంతో దోషులను ఉరితీయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉరిశిక్షను అమలుచేయడానికి జైలులో తలారీ అందుబాటులో లేకపోవడంతో దీనిపై తీవ్ర చర్చ సాగింది. అయితే, దోషులను ఉరితీయడానికి మీరట్ జైలు తలారి జలాద్ ముందుకొచ్చారు. నిర్భయ దోషులను ఉరి తీసేందుకు మీరట్ జైలుకు చెందిన తలారి జలాద్ సేవలను ఉపయోగించుకోనున్నామని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తీహార్ జైలు అధికారి పేర్కొన్నారు. అలాగే బిహార్‌లోని బక్సార్‌ జైలు ఖైదీలు సిద్ధం చేసిన ఉరి తాళ్లను తీహార్ జైలుకు తరలించినట్టు సమాచారం. పార్లమెంట్‌పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు, ముంబై ఉగ్రదాడుల కేసులో అజ్మల్ కసబ్, 93 ముంబై బాంబు పేలుళ్ల కారకుడు యాకూబ్ మెమన్‌ల ఉరికి బక్సార్ జైలు తాళ్లనే ఉపయోగించడం విశేషం. ఉరితాళ్లకు బక్సార్ సెంట్రల్ జైలు ప్రసిద్ధి గాంచింది. వీటిని మనీలా రోప్స్‌గా పిలుస్తారు. మొత్తం 10 ఉరితాళ్లను సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని జైళ్లకు ఉరితాళ్లు బక్సార్ జైలు నుంచే సరఫరా చేస్తారు. గతంలో కొన్ని చోట్ల వీటిని తయారుచేసినా బక్సార్ జైల్లో తయారయ్యే ఉరితాళ్లకు 90 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ తాళ్లతో దోషులను ఉరితీసేటప్పుడు విఫలమయ్యే ప్రసక్తే ఉండదు. భాగల్పూర్ సెంట్రల్ జైల్లో ఖైదీలను ఉరితీయడానికి 1992,1995లోనూ, 2004లో పశ్చిమ్ బెంగాల్ రేపిస్ట్‌ ధనుంజయ్ ఛటర్జీని ఉరితీయడానికి బక్సార్ నుంచే తాళ్లను పంపారు.

పదోతరగతి ఫీజు చెల్లింపు గడువు పెంపు

$
0
0
తెలంగాణలో పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును రూ.1000 ఆలస్యరుసుముతో జనవరి 22 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకనటలో తెలిపారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థలు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.125 చెల్లించాలి. మూడు సబ్జెక్టులు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.110 చెల్లిస్తే సరిపోతుంది. మూడుకంటే ఎక్కువ సబ్జెక్టులు రాసేవారు మాత్రమే రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. అయితే వీటికి రూ.1000 ఆలస్యరుసుము అదనంగా చె్లించాల్సి ఉంటుంది. Read Also: ఫీజు నుంచి వీరికి మినహాయింపు.. పదవ తరగతి పరీక్ష ఫీజు నుంచి నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారికి మినహాయింపు కల్పించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో రూ.24,000 లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20,000 లోపు కుటుంబ వార్షికాదాయం ఉన్న విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇందుకు గాను.. ఆయా విద్యార్థులు కుటుంబ వార్షికాదాయానికి సంబంధించి ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. Read Also..
Read More..➦ ➦

ఆ విషయంలో హైదరాబాదే నెం.1

$
0
0
ఆఫీస్ స్పేస్‌లను లీజులకు ఇచ్చే విషయంలో నగరం మొదటి స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం.. ఈ విషయం వెల్లడైంది. కార్యాలయాల లీజుల విషయంలో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలోకి రావడం ఇదే ప్రథమం కావడం విశేషం. నివేదిక ప్రకారం.. గతేడాది జులై నుంచి డిసెంబరు మధ్య కాలంలో 89 లక్షల చదరపు అడుగుల (స్క్వేర్ ఫీట్లు) విస్తీర్ణంలో కొత్తగా హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. వీటిలో ఐటీ రంగం 41 శాతం.. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాలు 18 శాతం, ఇతర రంగాలు 12 శాతం మేర కార్యాలయాలను లీజుకు పొందాయి. 2019 ఏడాది మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 1.28 కోట్ల స్క్వేర్ ఫీట్ల స్పేస్‌ లీజుకు ఇచ్చారు. Also Read: అయితే, ఇదే కాలంలో 70 లక్షల స్క్వేర్ ఫీట్ల కార్యాలయాల లీజుతో బెంగళూరు నగరం రెండో స్థానానికి పరిమితమైంది. మరోవైపు, గతేడాది మొత్తంగా చూసుకుంటే.. కార్యాలయాలను అత్యధికంగా లీజుకు తీసుకున్న నగరం బెంగళూరే. సంవత్సరం మొత్తంలో అక్కడ 1.53 కోట్ల స్క్వేర్ ఫీట్ల స్పేస్‌ను లీజుకు తీసుకున్నారు. దీని తర్వాత రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం విశేషం. Also Read: నిర్మాణ రంగం ఊపందుకోవడం, కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభం కావడం, నివాసాల అమ్మకాలు వంటి అంశాల్లో చక్కని వృద్ధి హైదరాబాద్‌లో కన్పించిందని నైట్ ఫ్రాంక్ ఇండియా () డైరెక్టర్ ఆర్ధర్ శాంసన్ మంగళవారం మీడియాతో అన్నారు. అయితే, 2019లో కార్యాలయాల లీజు దేశవ్యాప్తంగా 6.06 కోట్ల స్క్వేర్ ఫీట్ల మేర జరిగి, రికార్డు నెలకొల్పినట్లయింది. మరోవైపు హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు దేశంలోని ఇతర నగరాల కంటే ఎక్కువగా 10 శాతం మేర పెరిగాయి. దిల్లీలో 4.5 శాతం, కోల్‌కతాలో 3.1 శాతం, బెంగళూరులో 6.3 శాతం, అహ్మదాబాద్‌లో 2 శాతం పెరిగాయి. Also Read:

ఏపీ గవర్నర్ సంచలన నిర్ణయం.. అందరూ ఫిదా

$
0
0
ఏపీ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను జిల్లాల్లో పర్యటించే సందర్భంగా.. తనకు రెడ్ కార్పెట్ స్వాగతాలు పలికే సంప్రదాయాన్ని పాటించొద్దన్నారు. ఈ మేరకు అధికారులకు గవర్నర్ సూచనలు చేశారు. ఇదంతా బ్రిటీష్ వలసపాలకుల నాటిదని.. ఈ సంప్రదాయానికి ముగింపు పలకాలన్నారు. ఇటీవల శ్రీశైలం పర్యటన సందర్భంగా గవర్నర్‌ ఈ విషయాన్ని చెప్పారట. రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన కొన్ని అధికారిక కార్యక్రమాల్లో మినహా.. మిగిలిన తన పర్యటనల్లో ఎక్కడా రెడ్ కార్పెట్ స్వాగత సంప్రదాయాన్ని పాటించొద్దన్నారట. గవర్నర్ గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. తిరుమలకు వెళ్లే సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానం వద్దని.. సాధారణ విమానంలో వెళ్లారట. అలాగే హరిచందన్‌ను కలిసి శుభకాంక్షలు చెప్పేవారు మొక్కలు బహుమతిగా ఇస్తున్నారట. ఆ మొక్కల్ని జాగ్రత్త చేసి.. రాజ్‌భవన్‌ ప్రాంగణంలో నాటించారట.. అంతేకాదు కొన్ని మొక్కుల్ని ఉద్యోగులకు ఇచ్చి.. వివిధ ప్రదేశాల్లో నాటమని చెప్పారట. గవర్నర్‌ రాష్ట్ర ప్రథమ పౌరుడు కావడంతో.. రెడ్ కార్పెట్‌తో ఘన స్వాగతం లభిస్తుంది. కానీ ఏపీ గవర్నర్ మాత్రం విభిన్నంగా తనకు ఈ సంప్రదాయం వద్దని స్ఫష్టం చెప్పారు.. అనవసర ఖర్చులు వద్దన్నారు. హరిచందన్ నిర్ణయానికి ప్రజలు కూడా ఫిదా అవుతున్నారు.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇరాన్‌లో కూలిన ఉక్రెయిన్ విమానం.. 180 మంది మృతి?

$
0
0
ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్‌కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. ఉక్రెయిన్ నుంచి 180 మంది ప్రయాణికులతో ఇరాన్‌కు వస్తున్న ఈ విమానం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖయోమీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కూలిపోయినట్టు స్థానిక మీడియా తెలిపింది. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొంది. టెహ్రాన్ విమానాశ్రయంలో విమానం దిగుతుండగా సాంకేతిక లోపం తలెత్తి కూలిపోయినట్టు వివరించింది. అమెరికా సైన్యం 1988లో జరిపిన బాంబు దాడిలో 290 మంది ఇరానియన్లు మృతి చెందారని, దీని తర్వాత ఏం జరిగిందో ఆ దేశం గుర్తుంచుకోవాలంటూ ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ హెచ్చరిస్తూ ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్యపై ఎలాంటి స్పష్టం రాలేదు. విమానం కూలిపోయిన దృశ్యాలను కొందరు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. గాల్లో ఉండగానే విమానానికి నిప్పంటుకున్నట్లు వీడియో ఫుటేజ్‌లో స్పష్టమవుతోంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ‘1988 జులై పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్‌కు చెందిన విమానాన్ని అమెరికా నావికాదళం ప్రమాదవశాత్తు కూల్చివేయగా, 290 మంది మృతి చెందారు.. ఈ సంఖ్యను అమెరికా గుర్తుంచుకోవాలి.. ఎప్పుడూ బెదిరింపులకు పాల్పడకూడదు’ అంటూ రౌహానీ ట్వీట్ చేయడం గమనార్హం. ఇరాన్ విమానాన్ని కూల్చివేసిన ఆరు నెలల తర్వాత లాకోర్‌బీ తీవ్రవాదులు అమెరికా విమానాన్ని స్కాట్లాండ్‌లో 1988 డిసెంబరులో బాంబులతో కూల్చేశారు.. ఈ ఘటనలో 270 మంది చనిపోయారు. అయితే, లాకోర్‌బీ ఉగ్రవాదాలు కూల్చేశారని నిర్ధారించినా ఇది ఇరాన్ ప్రతీకారంగానే విదేశీ గూఢచారులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ట్వీట్ చేసిన గంటల్లోనే ఉక్రెయిన్ విమానం కూలిపోవడం అనుమానాలకు రేకెత్తుతున్నాయి.

రూ.3,000కే 4,000 mah బ్యాటరీ, డ్యూయల్ కెమెరా, 6.1 అంగుళాల డిస్ ప్లే.. Realme అదిరిపోయే ఫోన్ లాంచ్!

$
0
0
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ప్రారంభ శ్రేణిలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. రియల్ మీ సీ2ఎస్ పేరిట లాంచ్ అయిన ఈ మొబైల్ లో వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లే, ఫేస్ అన్ లాక్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. కానీ ధర మాత్రం రూ.3,000 శ్రేణిలోనే ఉండటం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్ ను రియల్ మీ థాయ్ ల్యాండ్ లో లాంచ్ చేసింది. అక్కడ దీని ధరను 1,290 బాత్(సుమారు రూ.3,065)లుగా నిర్ణయించారు. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒక్కటి మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది. డైమండ్ బ్లాక్ కలర్ లో దీన్ని రియల్ మీ లాంచ్ చేసింది. Also Read: స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.1 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లేను అందించారు. యాస్పెక్ట్ రేషియో 19.5:9 కాగా, స్క్రీన్ టు బాడీ రేషియో 80.3 శాతంగా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు దీన్ని పెంచుకోవచ్చు. Also Read: ఇక కెమెరా విషయానికి వస్తే.. రియల్ మీ సీ2ఎస్ లో వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. 13 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను వెనకవైపు అందించారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4,000 ఎంఏహెచ్ గా ఉంది. ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత కలర్ ఓఎస్ 6.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించలేదు. అయితే దీని స్థానంలో ఫేస్ అన్ లాక్ ఫీచర్ అందుబాటులో ఉంది. 4జీ వోల్టే, బ్లూటూత్, వైఫై, డ్యూయల్ సిమ్, మైక్రో యూఎస్ బీ పోర్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. Also Read: ఈ ఫోన్ ను రియల్ మీ ఎటువంటి హడావుడి లేకుండా సైలెంట్ గా రిలీజ్ చేసింది. ప్రస్తుతానికి థాయ్ ల్యాండ్ లో మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ స్మార్ట్ ఫోన్ మిగతా మార్కెట్లలోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. అయితే బడ్జెట్, ప్రారంభ శ్రేణి ఫోన్లకు మనదేశంలో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది కాబట్టి ఈ ఫోన్ త్వరలోనే మనదేశంలోకి కూడా వచ్చే అవకాశం ఉంది.

నిలిచిపోయిన మెట్రో రైళ్లు, కిక్కిరిసిన అమీర్ పేట్ స్టేషన్‌

$
0
0
రైలు రాకపోకలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాల వల్ల బుధవారం ఉదయం నుంచి ఓ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మెట్రో ద్వారా ప్రయాణించేందుకు రోజులాగే అమీర్ పేట్ స్టేషన్‌కు ప్రయాణికులు భారీగా రావడంతో అంతా అసౌకర్యానికి గురయ్యారు. వందలాది మంది ప్రయాణికులతో అమీర్ పేట్ స్టేషన్‌ కిక్కిరిసి పోయింది. దీంతో కార్యాలయాలకు వెళ్లాల్సిన వారు సతమతమవుతున్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి అమీర్ పేట్-రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్లు ఆగిపోయినట్లు తెలుస్తోంది. Also Read: మెట్రో రైళ్లు ఆగిపోవడంపై అసౌకర్యం చెందిన ప్రయాణికులు ట్విటర్‌లో తమ అసహనం వ్యక్తం చేశారు. మెట్రో బ్లూ లైన్‌లో ప్రయాణికుల రద్దీ బాగా ఉందని చెబుతూ, జనం కిక్కిరిసి ఉన్న ఫోటోను ఓ నెటిజన్ షేర్ చేశాడు. ‘‘నాగోల్-రాయదుర్గ్ మార్గంలో మెట్రో చాలా నెమ్మదిగా నడుస్తోంది. సడన్ బ్రేకులతో చిరాకు వస్తోంది. ఏదైనా స్టేషన్‌లో రైలు ఆపేయడం మంచి పని’’ అని మరో నెటిజన్ బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ట్వీట్ చేశాడు. ‘‘దాదాపు 20 నిమిషాల నుంచి ఇదే పరిస్థితి.’’ అని ప్లాట్‌ఫాంపై వేచి ఉన్న ఓ ఫోటోను ఇంకో నెటిజన్ ట్వీట్ చేశాడు. Also Read: సాంకేతిక సమస్యలతో అప్పుడప్పుడూ మెట్రో రైళ్లు నిలిచిపోయిన ఘటనలు గతంలో జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని సార్లు విద్యుత్ వైర్లు తెగిపడడం వల్ల కూడా అంతరాయం చోటు చేసుకుంది. వీటివల్ల రైళ్లు కొంతసేపటి వరకూ నిలిచిపోయాయి. బలమైన గాలులకు ఫ్లెక్సీలు విద్యుత్ వైర్లపై పడడం కూడా సమస్యగా మారింది. మరోవైపు కొద్ది నెలల క్రితం మెట్రో స్టేషన్ల నిర్మాణ లోపాలు కూడా బయటపడ్డాయి. అమీర్ పేట్ మెట్రో స్టేషన్ పై నుంచి పెచ్చులు ఊడిపడడంతో ఓ యువతి మరణించింది. స్టేషన్ కింద స్నేహితురాలి కోసం వేచి చూస్తుండగా, పెచ్చులు ఊడి ఆమె తలపై పడ్డాయి. ఈ ఘటన విమర్శలకు దారి తీసింది. Also Read:

ప్రియుడికి నగ్నంగా ఫోజులిచ్చిన బాలిక.. గుట్టుగా రికార్డ్ చేసి రూ.5లక్షలు డిమాండ్

$
0
0
ప్రేమ పేరుతో బాలికను నమ్మించి నగ్న వీడియో సేకరించి రూ.5లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విరుదునగర్‌ జిల్లా పల్లపట్టిరాజన్‌ వీధికి చెందిన రాజశివసుందర్‌ (29) బీటెక్‌ చదివి ,, తిరుముల్‌లైవాయల్, ఆవడి, మైలాపూర్‌ ప్రాంతాల్లో కంప్యూటర్‌ సెంటర్స్‌ నడుపుతున్నాడు. కొద్దిరోజుల క్రితం సెల్‌ఫోన్‌లో గేమ్‌ ఆడుతుండగా చెన్నైలోని వాషర్‌మెన్‌పేట శ్రీనివాసపురానికి చెందిన 16 ఏళ్ల బాలికతో అతడికి పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అతడు చెప్పడంతో బాలిక నమ్మింది. ఓ రోజు వీడియో కాల్‌లో మాట్లాడుతుండగా న్యూడ్‌గా కనిపించాలని శివసుందర్‌ బాలికను కోరాడు. తన ప్రియుడే కదా ఎలాగూ పెళ్లిచేసుకుంటానన్నాడు కదా అని బాలిక దుస్తులు విప్పేసి అతడి ముందు ఫోజులిచ్చింది. Also Read: వాటిని తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన రాజశివసుందర్ కొద్దిరోజుల తర్వాత బయటికి తీసి ఆమెను బెదిరింపులకు దిగాడు. ఇటీవల కోయంబేడుకు రావాలని కోరగా బాలిక వెళ్లలేదు. దీంతో ఆగ్రహించిన అతడు ఆమె నగ్న వీడియోను వాట్సాప్‌కు పంపించి బెదిరించాడు. కంగారుపడిన బాలిక ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. బాలిక తల్లి రాజశివసుందర్‌కు ఫోన్ చేసి తమ కుటుంబ పరువు తీయొద్దని వేడుకోగా.. రూ.5లక్షలిస్తేనే వీడియో డిలీట్ చేస్తానని డిమాండ్ చేశారు. Also Read: దీంతో ఆమె వాషర్‌మెన్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక చిన్నాన్నలా మాట్లాడుతున్నట్లు ఓ కానిస్టేబుల్‌తో నాటకమాడించారు. కోరినట్లుగానే రూ.5లక్షలు ఇస్తామని, ఎక్కడికి రావాలి అని అడగ్గా నిందితుడు కోయంబేడు రావాలని చెప్పాడు. దీంతో అతడు చెప్పిన చోటికి వెళ్లిన పోలీసులు నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాజశివసుందర్‌ను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. Also Read:

నిర్భయ దోషులకు డెత్ వారెంట్.. తిహార్ జైల్లో ఈ రోజు ఉరికంబాలకు..

$
0
0
నిర్భయ హంతకులకు ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులను తిహార్ జైల్లోని మూడో నంబర్ కారాగారంలో ఒకేసారి ఉరి తీయనున్నారు. పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడంతో.. ఏడేళ్ల తర్వాత నిర్భయకు న్యాయం జరగనుంది. ఆసియాలోని అతిపెద్ద జైలు ప్రాంగణాల్లో ఒకటిగా పేరొందిన తిహార్ జైల్లో బుధవారం డమ్మీ ఉరిశిక్షను అమలు చేసి.. ఉరికంబాల పటిష్టతను పరీక్షించనున్నారు. పబ్లిక్ వర్క్స్ విభాగానికి చెందిన ఇంజినీర్ తనిఖీల్లో భాగగంగా దోషుల బరువు కంటే కాస్త ఎక్కువ బరువున్న ఇసుక బస్తాలను 1.8 మీటర్ల నుంచి 2.4 మీటర్ల ఎత్తులో వేలాడదీస్తారు. గత డిసెంబర్లోనూ ఉరి కంబాల పటిష్టతను పరిశీలించడం కోసం ఇలా డమ్మీ ఉరి శిక్షను అమలు చేశారు. ఉరితీయడానికి ముందు రోజు సాయంత్రం కూడా మరోసారి డమ్మీ ఉరి శిక్ష అమలు చేస్తారు. నిర్భయ దోషులను ఉరితీయడానికి బిహార్లోని బక్సర్ జైలు నుంచి ఉరి తాళ్లను తెప్పిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జైలు నుంచి తలారిని తీసుకొస్తున్నారు. ఒకేసారి నలుగురిని ఉరి తీయడం కోసం సదరు తలారి అంగీకరించాడని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం నిందితుల ఎత్తు, బరువుకు అనుగుణంగా తాళ్లను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. ముగ్గురు దోషులను తిహార్ జైల్లోని జైలు నంబర్ 2లో ఉంచగా.. నాలుగో వ్యక్తిని జైలు నంబర్ 4లో ఉంచారు. క్షమాభిక్ష పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్ లాంటి న్యాయ మార్గాలను ఉపయోగించుకోవడం కోసం వారికి 13 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. జనవరి 22న ఉరి శిక్ష అమలు చేయడానికి ముందు చివరిసారిగా తమ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం దోషులకు కల్పిస్తారు. నలుగురు దోషులను వేర్వేరు సెల్‌లలో ఉంచుతామని.. రోజుకు రెండుసార్లు చొప్పున వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని చీఫ్ తెలిపారు. డెత్ వారెంట్ జారీ అయ్యాక ఉరి శిక్షను ఎదుర్కొంటున్న దోషులతో ఎలాంటి పనులు చేయించరు. జైలు అధికారులు వారిపై నిరంతరం నిఘా వేసి ఉంచుతారు.

ఆ ఘటన కలిచివేసింది.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్

$
0
0
అమరావతిలో మరో రైతు కన్నుమూశాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతు అద్దేపల్లి కృపానందం గుండెపోటుతో ప్రాణాలు వదిలినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రైతు రాజధాని కోసం అర ఎకరం పొలం ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. రైతు మరణంపై మాజీ మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి ట్వీట్ చేశారు.. ఈ ఘటన తనను కలిచివేసిందన్నారు. జగన్ గారి చెత్త నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారని మండిపడ్డారు. ప్రాణం కంటే ఎక్కువుగా ప్రేమించే భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తోంది అన్నారు. కృష్ణాయపాలెంలో ఆందోళనతో రైతు కృపానందం మృతి చెందడం నన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు లోకేష్. వైఎస్సార్‌సీపీ నాయకులు రైతులను అవమనిస్తూ, కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలు రైతులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి అన్నారు లోకేష్. మూర్ఖంగా వ్యవహరించకుండా రాజధాని పై ప్రభుత్వం పునరాలోచించడం మంచిదని అభిప్రాయపడ్డారు మాజీ మంత్రి.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. వారికి భారత్ కీలక సూచన

$
0
0
గతవారం బాగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా సైన్యం రాకెట్ దాడులకు పాల్పడి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సైన్యాధిపతి ఖాసిం సులేమానీని మట్టుబెట్టిన తర్వాత పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తాజాగా, ఇరాక్‌లోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. అల్‌ అసద్‌, ఇర్బిల్‌ ఎయిర్‌బేస్‌లపై డజనుకుపైగా క్షిపణులతో దాడిచేసింది. సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన నాలుగు రోజుల్లోనే ఈ దాడికి పాల్పడటం గమనార్హం. ఇరాన్‌తో చేసుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలగిన అమెరికా.. మధ్య ఆసియాలో యుద్ధ విమానాలను మోహరిస్తామని 2019 మేలో ప్రకటించింది. అంతకు ముందే ఏప్రిల్‌లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం విశేషం. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. తాజాగా సులేమానీ హత్యతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలకు భారత్ సూచనలు జారీచేసింది. ఇరాన్, ఇరాక్ సహా పర్షియన్ గల్ఫ్, ఒమన్ గగనతలం మీదుగా విమాన ప్రయాణాలు ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితం కాదని హెచ్చరించింది. ఇరాక్‌లో ప్రత్యేక పరిస్థితి నెలకున్నాయని, తదుపరి ప్రకటన వెలువడే వరకూ అత్యవసరమైతే తప్ప ఆ దేశానికి భారత పౌరులు తమ ప్రయాణాలు వాయిదావేసుకోవాలని విదేశాంగ శాఖ ప్రకటించింది. అలాగే ఇరాక్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, ఆ దేశంలో ప్రయాణించడం అంత క్షేమం కాదని ఓ ప్రకటనలో విదేశాంగ శాఖ వెల్లడించింది. మరోవైపు, తన సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడటంపై అమెరికా తీవ్రంగా పరిగణించింది. మధ్య అసియా వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున దళాలను తరలిస్తామని రక్షిణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఏ మాత్రం సిగ్గున్నా పదవి నుంచి తప్పుకోండి: ఒవైసీ

$
0
0
ఎన్‌పీఆర్, ఎన్ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్ర తరం చేస్తున్న ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ తాజాగా ఢిల్లీ దాడి ఘటనపై స్పందించారు. వర్సిటీ విద్యార్థులపై పోలీసులు కేసు చేయడాన్ని ఒవైసీ తప్పుబడ్డారు. ముందు దాడికి పాల్పడ్డవారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థులకు సంరక్షకుడిగా ఉండాల్సిన జేఎన్‌యూ వీసీ సిగ్గుంటే తన పదవి నుంచి తప్పుకోవాలని తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ముసుగు దుండగులు వర్సిటీ లోనికి ఎలా ప్రవేశించారు. ఏ బీజేపీ ఎంపీకి ఈ వ్యవహారంతో సంబంధముంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఆపాలి. దుండగుల చేతుల్లో ఇనుప రాడ్లు ఉన్నాయి. చివరికి జేఎన్‌యూ విద్యార్థి నాయకుణ్ని కూడా వారు కొట్టారు. ఇది కచ్చితంగా హత్యాయత్నమే’’ అని ఒవైసీ విమర్శలు చేశారు. Also Read: దాడి సమయంలో ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఢిల్లీ పోలీసులు తాత్సారం చూపారని, విద్యార్థినుల విషయంలోనూ జాలి చూపలేదని విమర్శించారు. అదే జామియా మిల్లియా విశ్వవిద్యాలయంలో సీఏఏ ఉద్రిక్తతల సమయంలో మాత్రం పోలీసులు వ్యవహరించిన తీరుకు ఓ విద్యార్థి కంటి చూపు పోయిందని ధ్వజమెత్తారు. జేఎన్‌యూ దాడిలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థినిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇదే ‘న్యూ ఇండియా’ కాబోలు అని ఎద్దేవా చేశారు. అయితే, పోలీసుల వాదన మరోలా ఉంది. జనవరి 5న జరిగిన ఘటనలో వర్సిటీలోని సర్వర్ రూం విధ్వంసం వ్యవహారంలో విద్యార్థినిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. Also Read: ఆదివారం యూనివర్సిటీలోకి ముసుగు దుండగులు చొరబడి కొందరు విద్యార్థులపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. వీరి దాడిలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా అసదుద్దీన్ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఈ నెల 10న జరుగుతుందని కొద్ది రోజుల క్రితమే వెల్లడించారు. మళ్లీ జనవరి 25న చార్మినార్ వద్ద మరో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. Also Read:

కార్తీకదీపం జనవరి 8 ఎపిసోడ్‌: ఎవరి ఊహల్లో వాళ్లు! ట్విస్ట్‌ అదిరింది

$
0
0
గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే... శ్రావ్య’ ఆదిత్యల దగ్గర భాగ్యం హడావిడి చేస్తూ ఉంటుంది. ఇంతలో రిజ్వానా డాక్టర్‌ వచ్చి శ్రావ్యని చెక్‌ చేసి రెండు రోజుల్లో ఆస్పత్రుల్లో జాయిన్‌ చేయాల్సి ఉంటుందని చెప్పి.. వెళ్లిపోతుంది. ఆ విషయం సౌందర్యకు ఫోన్‌ చేసి చెప్పాడు ఆదిత్య. దాంతో సౌందర్య, ఆనందరావులు చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతారు. 699 ఎపిసోడ్‌ హైలెట్స్‌... కార్తీక్‌ హిమని కారులో తీసుకుని వెళ్తుంటే.. ‘డాడీ నాకు ఎందుకు నిజం చెప్పలేదు? వంటలక్కే శ్రావ్య పిన్ని వాళ్ల అక్క కదా? అలాంటప్పుడు సౌర్య వాళ్ల డాడీ నీకు ముందే తెలిసి ఉంటుంది కదా? నువ్వు ఎందుకు నా దగ్గర నిజం దాచావ్‌?’ అని గట్టిగా అడుగుతుంది. దాంతో ఉలిక్కిపడి కారు బ్రేక్‌ వేస్తాడు కార్తీక్‌. సీన్‌ కట్‌ చేస్తే.. పక్కనే హిమ ఉండదు. అదంతా తన ఊహ. ‘నిజంగానే హిమకు.. సౌర్య తండ్రిని నేనే అని తెలిస్తే ఊరుకోదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియడానికి వీళ్లేదు..’ అని నిర్ణయించుకుంటాడు. దీప మనసులో.. ‘అత్తమ్మ నన్ను పదే పదే హిమ తల్లి ఎవరూ అని అడుగుతుంది. ఈ సమయంలో హిమ తల్లి నేనే అని తెలిస్తే ఊరుకోదు. దాంతో డాక్టర్‌ బాబు నిలదీస్తుంది. డాక్టర్‌ బాబు అనకూడని మాటలతో దాని మనసుని బాధపెట్టే ప్రమాదం ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియడానికి వీల్లేదు..’ అనుకుంటుంది. మౌనిత లాయర్‌ని కలిసి.. ఎలాగైనా దీప, కార్తీక్‌లకు విడాకులు వచ్చేలా చెయ్యాలని మరోసారి చెబుతుంది. అందుకు లాయర్‌ సరే అంటాడు. సౌందర్య, ఆనందరావులు స్కూల్‌కి వెళ్లడానికి సిద్ధమవుతారు. ఇద్దరూ కూర్చుని.. ‘కార్తీక్‌ లైన్‌లోకి రావాలంటే హిమకు నిజం తెలియడమే కరెక్ట్‌ కానీ.. జాగ్రత్తగా హిమకు నిజం తెలిసేలా చెయ్యాలి’ అని నిర్ణయించుకుంటారు. ఇద్దరూ కలిసి స్కూల్‌కి వెళ్తారు. అక్కడ సౌర్య, హిమ, వంటలక్కా ఎదురు చూస్తూ ఉంటారు. ‘అంతా కలిసి లోపలికి వెళ్లండి డాడీ కోసం నేను ఎందురు చూస్తాను’ అని చెప్పి హిమ అందరినీ లోపలికి పంపిస్తుంది. కమింగ్‌ అప్‌లో.. కార్తీక్‌ స్కూల్‌కి వస్తాడు. హిమని ఎత్తుకుని తిప్పి చాలా హ్యాపీగా ముద్దాడతాడు. మనసులో.. ‘అమ్మయ్యా ఆ వంటలక్కా.. దాని ఫ్యాన్స్‌ అసోషియేషన్‌ ఎవ్వరూ రాలేదు. చాలా హ్యాపీగా ఉండొచ్చు’ అని హిమని తీసుకుని లోపలికి వెళ్తాడు. హిమవైపు చూస్తూ నడుస్తూన్న కార్తీక్‌.. హిమ కూర్చోమని సీట్‌ చూపిస్తుంది. చూసుకోకుండా దీప పక్కనే కూర్చుంటాడు. తన చెయ్యి దీపకు తగలడంతో సారీ చెప్పడానికి తిరిగి చూసి షాక్‌ అవుతాడు. ఆ సీన్‌ అదిరిపోయింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. కొనసాగుతోంది.

80 మంది అమెరికా ఉగ్రవాదులను హతమార్చాం: ఇరాన్ ప్రకటన

$
0
0
ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై మంగళవారం రాత్రి బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇరాక్‌లోని అల్ అసద్, ఇర్బిల్‌ ఎయిర్‌బేస్‌లపై డజనుకుపైగా క్షిపణులతో దాడిచేసినట్టు పెంటగాన్‌ ధ్రువీకరించింది. అయితే, ఇరాన్ క్షిపణి దాడిలో ప్రాణనష్టంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని అమెరికా ప్రకటించింది. కానీ, తాము జరిపిన క్షిపణి దాడుల్లో 80 మంది అమెరికా తీవ్రవాదులు హతమయ్యారని ఇరాన్ అధికార మీడియా ప్రకటించింది. అల్ అసద్ స్థావరంపై తొమ్మిది క్షిపణులతో ఇరాన్ దాడిచేసినట్టు స్థానిక భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడులకు తామే పాల్పడినట్టు ఇరాన్ తన అధికారిక మీడియాలో ప్రకటించింది. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా చేసిన ఇరాన్ క్షిపణి దాడులను ఏవీ అడ్డుకోలేకపోయానని, మొత్తం 15 క్షిపణులతో దాడిచేసినట్టు తెలిపింది. అంతేకాదు, ఒకవేళ అమెరికా మరోసారి దుస్సాహసానికి ఒడిగడితే ఆ దేశానికి చెందిన 100 స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడిచేస్తామని హెచ్చరించింది. Read Also: ఇదిలా ఉండగా ఇరాక్ దాడిలో జరిగిన నష్టంపై అమెరికా అంచనా వేస్తోంది. ఇరాన్ క్షిపణి దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. అంతా బాగానే ఉందని వ్యాఖ్యానించారు. క్షిపణి దాడులను ఖండించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. పశ్చిమాసియాకు మరిన్ని బలగాలను తరలించాలని ఆదేశించారు. ఇరాన్‌ మెరుపు దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. Read Also: ఇదే సమయంలో అమెరికా సైన్యం పశ్చిమాసియాను విడిచివెళ్లాలని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్‌లో అతిపెద్ద సైనిక స్థావరమైన అల్ అసద్‌లో విదేశీ బలగాలు, సంకీర్ణ దళాలు ఉపయోగించుకుంటున్నాయి. మరోవైపు, ఇరాన్ క్షిపణి దాడిలో తమ సైనికులు ఎవరూ చనిపోలేదని, వారు గాయపడలేదని డెన్మార్ రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

అలెర్ట్.. బైక్‌ వెనుక సీటుపై కూర్చున్న వారికీ హెల్మెట్ ఉండాల్సిందే!

$
0
0
బైక్ మీద వెళ్లేటప్పడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే నిబంధన పాటిస్తున్నారా? వెరీ గుడ్. మరి బ్యాక్ సీటుపై కూర్చున్న మీ వాళ్ల సంగతి..? బైక్ నడిపే వారికి హెల్మెట్ ఉంటే చాలు, వెనుక కూర్చున్న వాళ్లకు అవసరమా అని మీరు అనుకోవచ్చు. కానీ పోలీసులు మాత్రం బైక్ మీద కూర్చున్న ఇద్దరికీ హెల్మెట్ ఉండాల్సిందే అంటున్నారు. బైక్ నడిపే వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ ఉండాలని ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీ ఎల్ఎన్ రాజు స్పష్టం చేశారు. బైక్ నడిపే వ్యక్తి మాత్రమే హెల్మెట్ ధరించి, వెనుక సీట్లో ఉన్న వారికి హెల్మెట్ లేకపోతే నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు. బైక్ మీద ప్రయాణించే ఇద్దరు వ్యక్తులూ హెల్మెట్ ధరించే విషయమై.. మంగళవారం ఉప్పల్ క్రాస్ రోడ్‌లో వాహనదారులకు అవగాహన కల్పించారు. 2019లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 750 మంది యాక్సిడెంట్లలో చనిపోయారు. వీరిలో 26 మంది బైక్‌ వెనుక సీటుపై కూర్చున్న వారేనని ఏసీసీ రాజు తెలిపారు. ద్విచక్ర వాహనం మీద ప్రయాణించే ఇద్దరికీ హెల్మెట్ లేకపోతే మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 129 ప్రకారం రూ.100 ఫైన్ విధిస్తామన్నారు. ఇప్పటి వరకూ మన దేశంలో ముంబై, బెంగళూరు, న్యూ ఢిల్లీ లాంటి నగరాల్లోనే బైక్ వెనుక సీట్లో కూర్చున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధన అమల్లో ఉంది. మోటార్ వెహికల్ చట్టంలో ఈ నిబంధన ఉన్నప్పటికీ.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెనుక సీటుపై కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ ఉండటాన్ని తప్పనిసరి చేయలేదు. కానీ ప్రమాదాల్లో బైక్ వెనుక కూర్చున్న వ్యక్తులు చనిపోయిన కేసులు పెరుగుతుండటంతో.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బైక్‌పై ప్రయాణించే ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధనపై ఫోకస్ పెట్టారు. త్వరలోనే నగరంలో ఈ నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
Viewing all 86433 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>