Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all 86453 articles
Browse latest View live

హైదరాబాద్‌లో వేలాది క్యాబ్ బుకింగ్‌ల నిలిపివేత

$
0
0
హైదరాబాద్‌లో క్యాబ్, ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని, దీనికి నిరసనగా.. బంద్ చేపడుతున్నట్లు సంఘాలు ప్రకటించాయి. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బుక్కైన సుమారు 3 వేలకు పైగా ఒలా, ఊబెర్ సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో గ్రేటర్హైదరాబాద్‌లో బుధవారం 80 వేలకు పైగా క్యాబ్‌లు, లక్షకు పైగా ఆటోలు రోడ్కెక్కవని ఆటో, క్యాబ్ జేఏసీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ తెలిపారు. కాగా, రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వారి నుంచి ప్రధానంగా వినిపిస్తోంది. నగరంలో కొన్ని క్యాబ్‌లు మాత్రం నడుస్తున్నా ధర మాత్రం చుక్కలు చూపిస్తోంది. సాధారణ రేటు కన్నా రెట్టింపు వసూలు చేస్తుండడం గమనార్హం. Also Read: మోటారు వాహన చట్టం-2019ను రద్దు చేయాలని, ఒకవేళ బుకింగ్ రద్దు చేస్తే రూ.500 జరిమానా వేయడాన్ని నిలిపివేయాలని క్యాబ్ డ్రైవర్లు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ-చలాన్లు తీసేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. Also Read: ఇంకా, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా తప్పనిసరిగా అందించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా సిటీలో కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే ఒలా, ఉబెర్ సంస్థలు తమను దోపిడీ చేస్తున్నాయని, వాటిని నియంత్రించాలని, డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని సలావుద్దీన్ కోరారు. Also Read:

సీఎం జగన్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన టీడీపీ ఎమ్మెల్సీ

$
0
0
అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరుసగా 22వ రోజు రైతులు, పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నారు. రాజధాని గ్రామాల్లో దీక్షలు, ధర్నాలు నడుస్తున్నాయి.. రోడ్లపై బైఠాయించిన రైతులు.. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు మద్దతుగా పలు పార్టీలు దీక్షలు, నిరసనలు తెలియజేస్తున్నాయి. అమరావతితో పాటూ విజయవాడలోనూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రైతులకు మద్దతుగా.. ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వినూత్నంగా నిరసన తెలియజేశారు. జగన్‌కు కళ్లజోడు, చెవి మిషన్‌ను గిఫ్ట్‌గా పంపించారు. జగన్ 'నేనున్నాను.. నేను విన్నాను' అన్నారని.. అమరావతి రైతులు 22 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే ఇలా గిఫ్ట్ పంపిస్తున్నాను అన్నారు. జగన్ ఎక్కడున్నారు‌? ఏం వింటున్నారు అంటూ ప్రశ్నించారు. అమరావతిలో రైతులు చనిపోతుంటే.. జగన్‌కు వినబడలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై లేదా అన్నారు బుద్దా. రైతులు చేస్తున్న ఆందోళనలపై ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకొని రైతులపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమని.. మహిళలపై దాడి చేశారని మండిపడ్డారు. చంద్రబాబుపై అమరావతిలో దాడి జరిగితే.. నిరసన తెలిపే హక్కు ఉందని కేసులు పెట్టలేదని.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేపై దాడి చేస్తే కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. డీజీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కార్చిచ్చు ప్రభావం.. పది వేల ఒంటెలను చంపేయనున్న ఆస్ట్రేలియా!

$
0
0
కార్చిచ్చు కారణంగా ఆస్ట్రేలియాలో కోట్లాది జంతువులు అగ్నికి ఆహుతి అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 50 కోట్ల జీవులు చనిపోగా.. మంటల్లో చిక్కుకొని కాలిపోయిన జంతువుల ఫొటోలు అందర్నీ కలచి వేస్తున్నాయి. మంటలను ఆర్పడం కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. మంటల కారణంగా జనం కూడా అల్లాడిపోతున్నారు. వేసవి కావడంతో నీటి కొరత వెంటాడుతోంది. ఇదే సమయంలో ఒంటెలు భారీగా నీటిని తాగేస్తున్నాయి. దీంతో దాదాపు 10 వేల ఒంటెలను హెలికాప్టర్ల ద్వారా చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించిందని కథనాన్ని వెలువరించింది. ఐదు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది. ఓవైపు మంటలు, మరో వైపు ఎండ కారణంగా ఆస్ట్రేలియన్ల పరిస్థితి దుర్భరంగా మారింది. ఒంటెలు కంచెలను దాటుకొని ఇళ్లలోకి చొరబడి మరీ నీటిని తాగేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆస్ట్రేలియన్లు వాపోతున్నారు. గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన మిథేన్ వాయువును కూడా ఒంటెలు భారీగా విడుదల చేస్తున్నాయట. ప్రతి 9 ఏళ్లకు ఒంటెల సంతతి రెట్టింపు అవుతుందట. అందుకే వీటిని చంపేస్తున్నామని చెబుతున్నారు. గత నవంబర్ నుంచి ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ప్రబలుతోంది. మంటల కారణంగా 12 మందికిపైగా మరణించగా.. 480 మిలియన్ల జంతువులు చనిపోయాయి లేదా ఆవాసాల నుంచి తరలి వెళ్లాయని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు తెలిపారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. షెడ్యూల్ ఇదే..

$
0
0
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 17న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని.. ఫిబ్రవరి 10న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు విడుదల చేయాలని సూచించింది. ఫిబ్రవరి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పింది. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఇక పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిషికేషన్ జారీ చేయాలని ఆదేశించింది. మార్చి 3లోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని సూచించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్‌ను కోర్టుకు సమర్పించారు. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. మార్చిలోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తికానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన షెడ్యూల్‌ను కోర్టు ఆమోదించింది. ఇటు ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కసరత్తునున మొదలు పెట్టింది. జిల్లాలవారీగా జెడ్పీ, ఎంపీటీసీ, పంచాయతీలకు రిజర్వేషన్లను కూడా ఖరారు చేసింది. కీలకమైన రిజర్వేషన్లు ఖరారు కావడంతో.. ఇక నోటిఫికేషన్ విడుదల చేయడమే తరువాయి.. దీంతో ఏపీలో మళ్లీ ఎన్నికల వేడి మొదలుకానుంది.

హైదరాబాద్‌లో ‘శ్మశాన’ నిశ్శబ్దం.. ఉరిని ముద్దాడిన ఆరుగురు

$
0
0
హైదరాబాద్‌ మహానగరంలో ఒకేరోజు వివిధ కారణాలతో ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమ విఫలమై.. కుటుంబ కలహాలతో.. వ్యాపారాల్లో నష్టం వచ్చి.. ఇతర కారణాలతో మొత్తం ఆరుగురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ మొత్తం ఘటనలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి. ప్రేమ విఫలమై ఇద్దరు యువకులు..ప్రేమ విఫలమై ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మారేడుపల్లి, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మంగళవారం ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఎస్‌ఐ లక్ష్మీనర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. మారేడుపల్లి సెకండ్‌ లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న రవిచైతన్య (21) బేగంపేట్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. యువకుడు గత కొంత కాలంగా ఓల్డ్‌ మారేడుపల్లికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే అతడి ప్రతిపాదనను యువతి తిరస్కరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రవి చైతన్య సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని కిందకు దించి గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. Also Read: మైలార్‌దేవ్‌పల్లిలో.. ఏపీలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన కోటేశ్వరరావు (25) తన తండ్రితో కలిసి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్‌లో 15 ఏళ్లుగా నివాసముంటున్నాడు. కోటేశ్వరరావు ఆర్కేస్ట్రా మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆమెను కలిసిన కోటేశ్వరరావు తన ప్రేమ ప్రతిపాదన చెప్పాడు. దీనికి యువతి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో పాల వ్యాపారి..ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ పాల వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చార్మినార్‌ డీఐ నరేశ్‌ కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా ప్రాంతానికి చెందిన అమిత్‌ గుప్తా (40) నగరానికి వలస వచ్చి కుటుంబంతో కలిసి శివరాంపల్లిలో ఉంటున్నాడు. గత 4 నెలలుగా అతను చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మోతీబేగం మసీదు వద్ద పాలు, పాల పదార్థాల వ్యాపారం కొనసాగిస్తున్నాడు. అయితే అతడికి రూ. 12 లక్షల అప్పులు ఉండటంతో వాటిని తీర్చలేక మనస్తాపానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో అప్పుల వారి నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో మంగళవారం మధ్యాహ్నం దుకాణంలోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరివేసుకుని యువతి..గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ గెస్ట్‌ హౌస్‌లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ నవీన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్‌ ప్రాంతానికి చెందిన మౌనికరావు (25) గచ్చిబౌలిలోని ఓయోలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ రాజరాజేశ్వరీ కాలనీలోని కాకతీయ రెసిడెన్సీలో ఉంటోంది. ఆదివారం రాత్రి భోజనం చేసి గదిలోకి వెళ్లిన ఆమె బయటికి రాలేదు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె స్నేహితుడు రీహాన్‌ అక్కడికి వెళ్లాడు. తలుపు తీసి చూడగా మౌనిక చున్నీతో ఫ్యాన్‌కు వేసుకొని కనిపించింది. వెంటనే రీహాన్‌ 108కి ఫోన్ చేయడంతో సిబ్బంది వచ్చి ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Also Read: భార్యతో గొడవపడి..భార్యతో గొడవపడ్డ ఓ యువకుడు తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ దేవేందర్‌ తెలిపిన వివరాల మేరకు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా గట్టురయపాకల గ్రామానికి చెందిన గౌనీ బొగురయ్య (30) ఎనిమిదేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో నివసం ఉంటున్నాడు. సోమవారం రాత్రి అదే ప్రాంతంలో ఉంటున్న అత్తవారింట్లో ఫంక్షన్‌కు వెళ్లాల్సి ఉండగా తాను రానని చెప్పాడు. అయితే రాత్రి 10 గంటల సమయంలో భార్య పద్మ, మామ వచ్చి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన అతడి భార్య కిటికీలో నుంచి చూడగా బొంగురయ్య సీలింగ్‌ రాడ్డుకు చున్నీతో ఉరేసుకుని కనిపించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, సోమవారం ఉదయం భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని ఈ నేపథ్యంలో అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. ఉరివేసుకుని మహిళ..అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వరప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా మల్లేపల్లికి చెందిన రవి, రాజేశ్వరి (33) దంపతులు నగరానికి వలస వచ్చి అల్వాల్‌లోని మంగాపురం కాలనీలో ఉంటున్న దామోదర్‌రెడ్డి వద్ద పని చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం రాజేశ్వరి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి కులాయప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Also Read:

ప్రేమ పేరుతో యువతి‌ని లోబరుచుకుని.. కులం తక్కువని వదిలేశాడు

$
0
0
ప్రేమ పేరుతో యువతిని లోబర్చుకుని తక్కువ కులం దానివంటూ పెళ్లికి నిరాకరించిన ఓ యువకుడికి విశాఖలోని న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్షతోపాటు వెయ్యి రూపాయలు జరిమానా విధించింది. అతడికి సహకరించిన తల్లి దూడ నూకరత్నం, సోదరి దూడ రాజేశ్వరిలకు సంవత్సరం చొప్పున జైలుశిక్షతో పాటు చెరో వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ 11వ అదనపు జిల్లా న్యాయస్థానం కమ్‌ ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) న్యాయస్థానం న్యాయమూర్తి వెంకట నాగేశ్వరరావు తీర్పునిచ్చారు. Also Read: విశాఖ జిల్లా జోడుగుళ్ళపాలెం ప్రాంతానికి చెందిన దూడ అప్పలరాజు స్థానికంగా ఓ యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమను అప్పలరాజు తల్లి, సోదరి కూడా ప్రోత్సహించారు. దీంతో అప్పలరాజు ప్రియురాలితో సినిమాలు, షికార్లకు వెళ్లేవాడు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లైంగికంగా లోబరుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా తక్కువ కులం దానివంటూ దుర్భాషలాడాడు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. Also Read: దీంతో బాధితురాలు ప్రియుడితో పాటు అతడి తల్లి, సోదరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ముగ్గురు నిందితులపై మోసం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావటంతో ముగ్గురు దోషులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. న్యాయస్థానం తీర్పు పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు. Also Read:

‘డాంగ్ డాంగ్’ సాంగ్ మేకింగ్.. మహేష్‌ను బాగా కష్టపెట్టారు!

$
0
0
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తోన్న క్రేజీ కమర్షియల్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమన్నా ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ సినిమాలోని డాంగ్ డాంగ్ అనే పాటలో తమన్నా నర్తించిన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పటికే జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. దేవీశ్రీ ప్రసాద్ తన మార్క్ బీట్‌తో సంగీత ప్రేమికులని అలరించారు. అయితే, ఈ పాటలో మహేష్ బాబు కూడా తన డ్యాన్స్‌తో అలరించనున్నారని ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది. తమన్నాతో పోటీగా మహేష్ డ్యాన్స్ చేశారని చెప్పారు. నిజంగానే ఈ పాటలో మహేష్ బాగా కష్టపడ్డారు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన ‘డాంగ్ డాంగ్’ సాంగ్ మేకింగ్ వీడియో చెబుతోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో మహేష్ డ్యాన్స్‌ ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటుంది. ఆర్మీ జవాన్లతో కలిసి తమన్నా డ్యాన్స్ చేయడం.. ఆ సెట్.. పిక్చరైజేషన్ అంతా కొత్తగా ఉంది. Also Read: ఈ మేకింగ్ వీడియోలో తమన్నా, అనిల్ రావిపూడి మాట్లాడారు. ఈ పాట చిత్రీకరణలో తన ఎక్స్‌పీరియన్స్‌ను చెప్పుకొచ్చారు తమన్నా. ఇప్పటి వరకు ఏ పాటలోనూ తాను ఆర్మీ లుక్‌లో కనిపించలేదని తమన్నా చెప్పారు. డాంగ్ డాంగ్ సాంగ్ కచ్చితంగా మరో పదేళ్లు పార్టీ సాంగ్‌లా ఉండిపోతుందని అన్నారు. మహేష్ బాబుతో డ్యాన్స్ చేసి ఐదేళ్లు అయిపోతుందని, ఈ పాటతో మళ్లీ ఆ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అనిల్ రావిపూడితో అన్నారు. తమన్నా ఆర్మీ వాళ్లతో డ్యాన్స్ చేయడం ఏంటి, అలా జరుగుతుందా అని చాలా మందిలో అనుమానాలు ఉన్నాయని.. కానీ, ఆర్మీ వాళ్లతో చాలా సార్లు చాలా మంది సెలబ్రిటీలు వెళ్లి ఇంటరాక్ట్ అయ్యారని, ఆ కాన్సెప్ట్ తనకు నచ్చి ఈ పాటను పెట్టానని అనిల్ రావిపూడి వివరించారు. ప్రియాంక చోప్రా లాంటి చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు వెళ్లారని గుర్తు చేశారు. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో గతంలో తాను పనిచేశానని.. కానీ, ఈ పాటలో చాలా కొత్తగా చూపించారని తమన్నా చెప్పారు. మహేష్, తను ఈ పాటలో చాలా చాలా ఫ్రెష్‌గా కనిపిస్తామని అన్నారు.

IND vs SL 3rd T20కి గాయంతో బౌలర్ ఔట్

$
0
0
భారత్‌తో కీలకమైన మూడో టీ20 ముంగిట శ్రీలంక జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెన్నునొప్పి గాయంతో ఆ జట్టు అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ ఇసురు ఉదాన టీమ్ నుంచి తప్పుకున్నాడు. ఇండోర్ వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆడిన ఉదాన.. బ్యాటింగ్‌లో 2 బంతులు ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే.. మ్యాచ్‌లో శ్రీలంక ఫీల్డింగ్‌కి వచ్చే ముందు జరిగిన చిన్న వార్మప్ సెషన్‌లో అతను గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో.. అతను ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్ చేయలేదు. భారత్, శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ జరుగుతుండగా.. ఇప్పటికే గువాహటిలో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత ఇండోర్ టీ20లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందగా.. కనీసం ఆఖరి టీ20లోనైనా గెలిచి సిరీస్‌ని సమం చేయాలని లంకేయులు ఆశిస్తున్నారు. కానీ.. ఫాస్ట్ బౌలర్ ఉదాన జట్టుకి దూరమవడం ఇప్పుడు ఆ టీమ్‌లో కంగారు పెంచుతోంది. ఇండోర్ టీ20లో లంక ఓటమికి ఉదాన గాయంతో బౌలింగ్‌కి దూరంగా ఉండటం కూడా ఓ కారణమేనని స్వయంగా కెప్టెన్ లసిత్ మలింగ చెప్పుకొచ్చాడు. సిరీస్‌లో మిగిలిన మూడో టీ20 మ్యాచ్ పుణె వేదికగా శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి జరగనుంది. ఇప్పటికే ఇండోర్ నుంచి బయల్దేరిన ఇరు జట్ల ఆటగాళ్లు.. ఈరోజు రెస్ట్ తీసుకుని గురువారం పుణెలో ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. భారత్ గడ్డపై చివరిగా ఆడిన 6 టీ20ల్లోనూ టీమిండియా చేతిలో ఓడిన శ్రీలంక.. గత దశాబ్దకాలంలో ఒక్కసారి కూడా ద్వైపాక్షిక సిరీస్‌ గెలవలేదు.

కన్న కూతురిపై రేప్ చేసి.. ఎయిడ్స్ తెప్పించి..! కోర్టు సంచలన తీర్పు

$
0
0
పదేళ్ల వయసున్న కన్న కూతురిపైనే ఏడాదిగా అత్యాచారానికి పాల్పడ్డాడో కీచక తండ్రి. తనకున్న ఎయిడ్స్‌ను అభంశుభం తెలియని ఆ బాలికకూ అంటించాడు. తమిళనాడులో ఈ ఘోరం జరగగా, నిందితుడిని తాజాగా కోర్టు దోషిగా నిర్ధారించింది. అలాగే ఆ కిరాతక తండ్రికి 4 జీవిత ఖైదులు, రూ. 4,500 జరిమానా విధిస్తూ తంజావూరు మహిళా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కిరాతకుడిని చనిపోయేంత వరకు జైల్లో ఉంచాలని ఆదేశించింది. 2017 నుంచి ఈ కేసుపై విచారణ సాగుతుండగా.. మంగళవారం తంజావూరు మహిళా కోర్టు తుది తీర్పు వెల్లడించింది. Also Read: తమిళనాడులోని తంజావూరు జిల్లాకు చెందిన కుమార్‌ (31) అనే వ్యక్తి కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతడికి భార్య, పదేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. కుమార్తె స్థానిక పాఠశాలలో చదువుతుండేది. అయితే భార్య కొంత కాలం క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి తన పదేళ్ల కుమార్తెపై తరచూ మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన ఉపాధ్యాయులు ఆమెను విచారించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన తండ్రి మద్యం మత్తులో ఏడాదిగా తనపై తరచూ లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు బాలిక చెప్పింది. దీంతో ఉపాధ్యాయులు చైల్డ్‌లైన్‌ సంస్థకు సమాచారమిచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: నిందితుడు కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే హాస్టల్‌లో ఉన్న ఆ బాలిక అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో నిర్వాహకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలికకు ఎయిడ్స్‌ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కుమార్‌కు కూడా పరీక్షలు చేయగా.. అతడికి సైతం ఉన్నట్లు తేలింది. దీంతో తండ్రి నుంచి బాలికకు ఎయిడ్స్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన కుమార్‌కు కోర్టు చనిపోయే వరకు కోర్టులోనే ఉంచాలని సంచలన తీర్పు ఇచ్చింది. Also Read:

Chandra Grahanam సంపూర్ణ చంద్రగ్రహణం: ఈ రాశులవారిపై ప్రభావం.. పరిహారాలు

$
0
0
ఈ ఏడాదిలో మొత్తం ఆరు గ్రహణాలు ఏర్పడతుండగా, ఇందులో తొలి గ్రహణం జనవరి 10 సంభవించనుంది. ఇది జనవరి 10 శుక్రవారం రాత్రి 10.37 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2.42 గంటల వరకు కొనసాగుతుంది. పునర్వసు నక్షత్రం మిథున రాశిలో సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం స్పర్శ కాలం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై, మధ్యకాలం రాత్రి 12 గంటల 31 నిమిషాలు, మోక్ష కాలం తెల్లవారుజామున 2 గంటల 31 నిమిషాలకు పూర్తవుతుంది. మొత్తం పుణ్యకాలం సమయం నాలుగు గంటలు. ఈ గ్రహణం భార‌త్, ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాల‌లో కనువిందు చేయనుంది. మిథున రాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణాన్ని ఆరాశి వారు చూడకపోవడం మంచిదని జ్యోతిషులు చెబుతున్నారు. మిథున రాశితోపాటు కర్కాటకం, సింహ, తుల, మకర రాశులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు అంటున్నారు. ఈ చంద్ర గ్రహణం పుష్యమాసం శుద్ధ చతుర్దశి పునర్వసు నక్షత్రం మిథున రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి మేషం, కన్య, వృశ్చిక, మీన రాశుల వారికి శుభం.. తుల, వృషభ, ధనుస్సు, కుంభ రాశులవారికి మధ్యమం.. మిథున, కర్కాటక, సింహ, మకర రాశుల వారికి అరిష్టం అంటున్నారు. శుక్రవారం రోజు రాత్రి వేళ భోజనం చేయరాదని కొందరు చెబుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల లోపు భోజనం ముగించాలని జ్యోతిషులు చెప్పడం గమనార్హం. గ్రహణం ఏ రాశిలో సంభవిస్తుందో ఆ రాశితోపాటు ప్రతికూల ప్రభావం చూపే రాశులవారు గ్రహణం విడిచిన తర్వాత నదీ స్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించాలని చెబుతున్నారు. శివ పంచాక్షరీ మంత్రం జపిస్తే శుభం జరుగుతుంది, గ్రహణం ఏర్పడిన 11 రోజులలోపు శివాలయాలలో రుద్రాభిషేకం చేస్తే దోషాలు, పరిహారం జరుగుతుందని వివరిస్తున్నారు. అలాగే బియ్యం, ఉలవలతోపాటు వెండి చంద్ర బింబం, నాగ పడగలు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వత్ల గ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పేర్కొంటున్నారు. శాస్త్రీయ పద్ధతులను, హిందూ సంప్రదాయాన్ని అనుసరించే వారు, గ్రహణం ముందు, గ్రహణ సమయంలో, గ్రహణం తరువాత స్నానాలు చేసి ధ్యానం చేస్తూ ఉండవచ్చు. గ్రహణం విడిచిన తరువాత ఇంటిని శుభ్రం చేసి, దేవుడి విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి. జంధ్యం వేసుకునే సంప్రదాయం ఉన్నవారు దాన్ని మార్చుకోవాలి. ఇంటిముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టించుకుంటే, గ్రహణ దృష్టి తొలగి శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

యుద్ధ భయాలు.. సూచీల బెదురు..!

$
0
0
నిన్న దుమ్ముదులిపిన దేశీ స్టాక్ మార్కెట్‌ ఈరోజు మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయింది. బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం డీలా పడ్డాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్ వెనకడుగు వేసింది. ఇరాక్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌లపై ఇరాన్ దాడి చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. సెన్సెక్స్ 52 పాయింట్ల నష్టంతో 40,818 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 12,025 వద్ద క్లోజయ్యాయి. మెటల్, బ్యాంక్, ఆటో రంగ షేర్లపై ఒత్తిడి కనిపించింది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగ షేర్లు జోరు చూపించాయి. Also Read: Stock Market Highlights.. ✺ నిఫ్టీ 50లో భారతీ ఎయిర్‌టెల్, యస్ బ్యాంక్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. ఎయిర్‌టెల్ 3 శాతానికి పైగా పెరిగింది. ✺ అదేసమయంలో ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా, ఎల్అండ్‌టీ, ఐఓసీ, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. ఐషర్ మోటార్స్ 4 శాతానికి పైగా పడిపోయింది. ✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ఉండిపోయాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ మెటల్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లు దాదాపు 1 శాతం నష్టపోయాయి. Also Read: ✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.50 శాతం పెరుగుదలతో 68.61 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.16 శాతం పెరుగుదలతో 62.80 డాలర్లకు ఎగసింది. ✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 7 పైసలు లాభంతో 71.76 వద్ద కదలాడుతోంది. Also Read:

మంత్రి కేటీఆర్‌తో న్యూజిలాండ్ ఎంపీ భేటీ.. ప్రధానితో సమావేశం!

$
0
0
న్యూజిలాండ్ ఎంపీ, ఏత్నిక్ అఫైర్స్ శాఖ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక రాధాక్రిష్ణన్.. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. బుధవారం (జనవరి 8) మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో కేటీఆర్‌తో సమావేశమైన ఆమె.. తెలంగాణతో అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్టప్ రంగాల్లో కలిసి పని చేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్‌లో పర్యటించాలని కేటీఆర్‌ను ఆమె అహ్వానించారు. ప్రధాని జెస్సిండాతో సమావేశం ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. న్యూజిలాండ్ దేశ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేస్తామని మంత్రి చెప్పారు. స్థానిక రాజకీయ వ్యవస్థల పనితీరుపై సమావేశంలో ఇరువురు నేతలు చర్చించారు. తెలంగాణలో ఉన్న పరిస్థితులను మంత్రి కేటీఆర్ న్యూజిలాండ్ ఎంపీకి వివరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం స్టార్టప్, ఇన్నోవేషన్ రంగంలో దేశంలోనే ముందు వరసలో ఉందని చెప్పారు. టీ-హబ్, వి-హబ్ లాంటి ఇంక్యూబేటర్ల ద్వారా ఈ రంగంలో ముందున్నామని వివరించారు. త్వరలోనే టీ-హబ్ రెండో దశ ప్రారంభం చేస్తున్నామని.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నామని ప్రియాంకకు మంత్రి కేటీఆర్ వివరించారు. విదేశీ స్టార్టప్ ఇకో సిస్టంతో కలిసి పనిచేసేందకు ఉద్దేశించిన టీ-బ్రిడ్జ్ కార్యక్రమాన్ని బలోపేతం చేయనున్నామని తెలిపారు. టీ-బ్రిడ్జ్ కార్యక్రమంలో భాగంగా న్యూజిలాండ్ స్టార్టప్స్‌తోనూ కలిసి పనిచేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. Also Read: అగ్రిటెక్ రంగంలోనూ అనేక అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు. పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్న సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఇప్పటికే ఇక్రిసాట్‌తో అగ్రిటెక్ రంగంలో పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. న్యూజిలాండ్ ప్రధాని జెస్సిండా అర్డన్ అద్భుతంగా పని చేస్తున్నారని, అమె నాయకత్వం స్ఫూర్పిదాయకమని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ప్రధానితో కలిసేందుకు తాను సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రియాంక తెలిపారు. ఇక్కడి వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని మంత్రి కేటీఆర్‌తో ఆమె అన్నారు. ఎంపీ ప్రియాంక గురించి.. చెన్నైకి చెందిన ప్రియాంక రాధాక్రిష్ణన్.. విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెలింగ్టన్‌లో విద్యాభ్యాసం చేశారు. అనంతరం న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. న్యూజిలాండ్ లేబర్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఏత్నిక్ అఫైర్స్ శాఖ పార్లమెంటరీ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశం పట్ల ప్రియాంక హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏన్నారైలతో న్యూజిలాండ్‌లో కలిసి పనిచేస్తున్నామని ఆమె తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్‌తో సమావేశం ఏర్పాటు చేసేందుకు సహకరించిన టీఆర్‌ఎస్ న్యూజిలాండ్ శాఖ నాయకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ ఏన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల పాల్గొన్నారు. Also Read:

ఏపీలో నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

$
0
0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మరో 15,971 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుధవారం సీఎం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. గ్రామ సచివాలయలు, రైతు భరోసా కేంద్రాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిన సీఎం.. ఫిబ్రవరి నుంచి ఇంటికే పింఛన్‌లు అందించాలని.. వాలంటీర్ల ద్వారా డబ్బు అందించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా మరో 300 గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. వాటిలో 3వేలమందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే సచివాలయాల్లో ప్రస్తుతం 15,971 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వీటన్నింటి భర్తీ చేయాలని ప్రభుత్వ అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. త్వరలోనే దీనికి సంబంధించి ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇక గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని జగన్ అధికారుల్ని ఆదేశించారు.తర్వాత మినీ గోడౌన్ల నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని.. సర్వేలతో ముడిపెట్టి ఇళ్లపట్టాలను నిరాకరించవద్దని అధికారులకు సీఎం సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి.. లబ్ధి దారుల్ని గుర్తించాలని సూచించారు. అర్హులైన వ్యక్తులు ఎంతమంది ఉన్నా పట్టాలు ఇవ్వాల్సిందేనన్నారు.

ఆ మగాళ్లేమైపోయారు.. వాసిరెడ్డి పద్మ ఘాటు వ్యాఖ్యలు

$
0
0
రాజధాని మహిళల ఉద్యమంపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఉద్యమంలో మహిళలను పావులుగా వాడుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. విజయవాడలో సత్తాలేని వారే మహిళలతో ఉద్యమం చేయిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. మహిళలను రోడ్డుపైకి తెచ్చి ఉద్యమాలు చేయించడమేంటని ప్రశ్నించారు. ఇదేం పౌరుషం.. ఇదేం ఉద్యమం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్న సమయంలోనూ ఇలానే చేశారా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఇప్పటి వరకు పదవులు అనుభవించిన.. పెత్తనం చేసిన మగాళ్లేమైపోయారని వాసిరెడ్డి ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ఉద్యమం పేరుతో మహిళలను ఎలా వాడుకుంటున్నారో అర్థమవుతోందన్నారు. పదవులు అనుభవించేది మగాళ్లు.. ఉద్యమం పేరుతో మహిళలను రోడ్లపైకి తీసుకువస్తారా అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Read Also: గతంలో పదవులు అనుభవించి విర్రవీగిన మగాళ్లేమైపోయారని ఆమె ప్రశ్నించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో భూములు కొనుక్కుని పెత్తనం చేసిన మాజీ ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులు ఏమయ్యారని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. ఇప్పుడేమో మహిళలను రోడ్డుపై కూర్చోబెట్టి అరెస్టులు అయ్యేలా చేస్తున్నారన్నారు. పదవులు అనుభవించడానికి మగాళ్లు.. ఉద్యమాలు చేసి దెబ్బలు తినడానికి ఆడవాళ్లు కావాల్సి వచ్చారని అని ఆమె తప్పుబట్టారు. మహిళలను రాజకీయ పార్టీలు పావులుగా వాడుకుంటున్నాయని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. మహిళలను ఓటు బ్యాంకుగా చూడడం దారుణమని.. ఉద్యమాల్లో ఆడవాళ్లను ముందుపెట్టి వెనుక దాక్కోవాలని చూడడం నీచ రాజకీయమని.. చిల్లర రాజకీయమని వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Also Read:

బ్రేకుల్లేని బస్సుల్లో పాక్‌కు పంపిస్తాం :బీజేపీ ఎంపీ బండి సంజయ్

$
0
0
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని సంజయ్ ఆరోపించారు. వరంగల్‌లో సీఏఏకు అనుకూలంగా బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఎంపీ బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారంతా దేశ ద్రోహులేనని, వారు దేశం విడిచి పాకిస్థాన్ పోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాడులకు భయపడబోమని, ఇకపై ఎదురుదాడి చేస్తామని అన్నారు. ఎంఐఎం పార్టీని దుర్భాషలాడుతూ మాట్లాడారు. ‘‘ఎంఐఎం నాయకులారా.. మీకు ఈ గడ్డ మీద స్థానం లేదు. మీరు అవసరమైతే పాకిస్థాన్ పోతారో, బంగ్లాదేశ్ పోతారో, అఫ్గానిస్థాన్ పోతారో నిర్ణయించుకోండి. కావాలంటే మీకు విమానం, హెలికాప్టర్ ఇస్తాం. అవసరమైతే బ్రేకుల్లేని బస్సులో పంపిస్తాం. సీఏఏ వాస్తవ విషయాలను అంతా గ్రహించాలి. అవాస్తవాలను నిజాలుగా ప్రచారం చేసే ఇలాంటి వారికి ప్రజలంతా బుద్ధి చెప్పాలి.’’ ‘‘ద్రోహుల్లారా ఖబడ్దార్.. మీరు రాళ్లు పడితే, మేం బాంబులు పడతాం. నువ్వు కట్టలు పడితే, మేం కత్తులు పడతాం. నువ్వు రాకెట్లు పడితే, మేం లాంచర్లతో కొడతాం. యుద్ధం మొదలైంది. ఎవర్నీ వదిలిపెట్టం. ఓరుగల్లు నుంచే యుద్ధం ప్రారంభిస్తాం. నిజాం వారసులై వాళ్లు పచ్చ జెండా పట్టుకొని వస్తే, ఛత్రపతి శివాజీ, వీర సావర్కర్, భగత్ సింగ్ వారసులమై కాషాయ జెండా, కమలం పువ్వు చేత పట్టుకొని, భారత్ మాతాకీ జై అంటూ మనం వస్తున్నాం. ఈ యుద్ధంలో దేనికైనా సిద్ధమై ముందుకు పోదాం.’’ అని మజ్లిస్ పార్టీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లేనని, ఒవైసీ సోదరుల ఆటలు తెలంగాణలో సాగవని ధ్వజమెత్తారు.

పందెం రాయుళ్లకు పోలీసుల షాక్.. మలికిపురంలో 45 పందెంకోళ్లు స్వాధీనం

$
0
0
సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండే సందడే వేరు. వీటిలో ముఖ్యమైనవి కోడిపందేలు. పందెం రాయుళ్లు ఆరు నెలల ముందు నుంచే పుంజులను సిద్ధం చేసేస్తారు. కొందరికైతే ఇది ఉపాధిలా మారిపోయింది. కోడిపుంజులను పెంచి భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఇలా విక్రయానికి సిద్దంగా ఉన్న 45 పందెం పుంజులను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. Also Read: నెల్లూరు జిల్లా నాయుడుపాలెం పట్టణానికి చెందిన దేవరకొండ సుబ్బారాయుడు, దేవరకొండ మధు, పాలకిర్తి నానయ్య, నాగయ్య, సీనయ్య, దాసరి రామస్వామిలతో కూడిన బృందం సుమారు 50 పందెం కోళ్లను లారీలో తీసుకొచ్చి మలికిపురంలోని పద్మ థియేటర్‌ సమీపంలో మంగళవారం ఆమ్మకానికి పెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న మలికిపురం ఎస్ఐ కె.వి.రామారావు సిబ్బందితో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఐదు పుంజులను అమ్మేయడంతో మిగిలిన 45 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Also Read: నిందితులపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. రాజోలు సర్కిల్‌ పరిధిలో పందెం కోళ్లను అమ్మినా, పందేలు నిర్వహించినా కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 45 మలికిపురం పీఎస్‌లో ఉన్నాయి. Also Read:

చోరీకి వచ్చి.. ఇంటి యజమాని కాళ్ల వేళ్లు నాకిన దొంగ!

$
0
0
ఇంట్లోకి చొరబడిన దొంగ.. బుద్ధిగా డబ్బు, నగలు, విలువైన వస్తువులను దొంగిలించి వెళ్లిపోవాలి. కానీ, ఈ దొంగకు అదేం బుద్ధో.. మంచం మీద నిద్రపోతున్న యజమాని కాళ్ల వేళ్లను నాకాడు. దీంతో ఉలిక్కిపడి లేచిన యజమాని.. ఎదురుగా తన కాళ్లను ఐస్‌క్రీమ్‌లా చప్పరిస్తున్న దొంగను చూసి షాకయ్యాడు. ఈ చిత్రమైన ఘటన ఫ్లొరిడాలోని బ్రాడెన్టాన్‌లో చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువకుడు ఇంట్లో నిద్రపోతుండగా.. కాళ్లపై ఏదో పాకుతున్నట్లు అనిపించి ఉలిక్కిపడి లేచాడు. కళ్ల ముందు ఓ దొంగ అతడి కాళ్ల వేళ్లను నాకడం చూసి ఆశ్చర్యపోయాడు. గట్టిగా కేకలు వేయబోతుండంగా.. తాను కాళ్ల వేళ్లను నాకేందుకు మాత్రమే వచ్చానని, డబ్బులు కోసం కాదని దొంగ చెప్పాడు. కేకలు వేస్తే తన ఫ్యాంటులో ఉన్న గన్ తీసి కాల్చేస్తానని, వృషణాలను నలిపేస్తానని దొంగ అతడికి వార్నింగ్ ఇచ్చాడు. అనంతరం బాధితుడిని పక్కకు గెంటేసి ఇంటి నుంచి ఉడాయించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడి ఇల్లు పరిశీలించారు. ఆ ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువును దొంగిలించలేదని తెలుసుకున్నారు. వెళ్తూ వెళ్తూ ఆ దొంగ.. బాధితుడి కారు అద్దాలను పగలగొట్టాడు. పోలీసులు జాగిలాలతో ఆ దొంగ ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బాధితుడి కాళ్ల మీద ఉన్న దొంగ లాలాజలాన్ని సేకరించి డీఎన్ఏ టెస్టు చేస్తున్నారు. అయినా, ఆ దొంగకు ఇదేం పాడు అలవాటండి బాబు!!

రికార్డుల రారాజు కోహ్లీ పేరిట ఉన్న కొన్ని రికార్డులు

$
0
0
విరాట్‌ కోహ్లీ, క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డ్స్, మరెన్నో విజయాలు సాధించాడు. టార్గెట్‌ చేజింగ్‌లో కింగ్ అయిన కోహ్లీ, ఆగష్టు, 2008 లో టీం ఇండియా తరపున ఆరంగ్రేటం చేసాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో 11 ఏళ్లలో తిరుగులేని స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుత తరంలో సచిన్ టెండూల్కర్ రికార్డులు బద్దలు చేసే సత్తా ఒక్క విరాట్ కోహ్లికు మాత్రమే ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. విరాట్‌ కోహ్లీ ఇప్పటివరకు సాధించిన రికార్డులు చాలా ఉన్నాయి. విరాట్‌ క్రికెట్ ఆరంగ్రేటం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అత్యధిక పరుగులు (21474 పరుగులు), టెస్టుల్లో అత్యధిక డబల్‌ సెంచరీలు (7 ద్విశతకాలు), అత్యధిక 150+ పరుగులు (14 సార్లు), అత్యధిక సెంచరీలు (70 సెంచరీలు), అత్యధిక హాఫ్ సెంచరీలు (101 అర్ధశతకాలు), అత్యధిక ఫోర్లు (2148)... ఇలా ప్రతీ రికార్డు ‘కింగ్’ సొంతమైంది. కేవలం క్రికెట్ గ్రౌండ్‌లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ‘కింగ్’ కోహ్లీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంటాడు. ప్రస్తుత తరంలో అందరికంటే తనకే ఫాలోయింగ్ ఎక్కువని నిరూపించుకున్నాడు. 2019 జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ అత్యధికంగా ఆన్‌లైన్‌లో శోధించిన క్రీడాకారుడిగా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా కోహ్లీ గురించి సగటున 2 మిలియన్ల మంది ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారట. ఆ తర్వాతి స్థానంలో ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ 9 నెలల్లో విరాట్ కోహ్లీ గురించి వెతికినవారి సంఖ్య రెట్టింపు అయ్యిందట.

వైఎస్ వివేకా హత్యకేసులో ట్విస్ట్.. నార్కోటెస్టుకు నో చెప్పిన నిందితుడు

$
0
0
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే 1400 మందికి పైగా వ్యక్తులను విచారించారు. హత్య కేసు నిందితుడు.. వివేకా సన్నిహితుడు పరమేశ్వర రెడ్డి సహా పలువురిని దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. పరమేశ్వర రెడ్డి ప్రతి కదలికను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో తాను అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో ఉన్నానని పరమేశ్వర్ రెడ్డి చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే హత్యకు కొద్దిరోజుల ముందు పరమేశ్వర్ రెడ్డి కడపలోని ఓ లాడ్జిలో టీడీపీ ముఖ్య నాయకుడిని కలిసి గంటల పాటు చర్చించినట్లు సమాచారం. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. లాడ్జికి వెళ్లిన తేదీ, సమయం, ఎన్ని గంటల పాటు అక్కడ ఉన్నాడు, ఎవరెవరితో మాట్లాడారనే విషయంపై ఆరా తీస్తున్నారు. Also Read: అనుమానితులను ఏ ఒక్కరినీ వదలకుండా అధికారులు ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని సిట్ బృందం విచారించింది. అయితే సిట్ అధికారుల విచారణను సవాల్ చేస్తూ బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు కోర్టును అభ్యర్ధించారు. పిటిషన్ విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కీలక నిందితుడిగా అనుమానిస్తున్న పరమేశ్వర రెడ్డికి నార్కోటెస్ట్ నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ మేరకు సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరమేశ్వర్ రెడ్డి నార్కోటెస్ట్ నిర్వహించేందుకు అనుమతించాలని కోరారు. అయితే నార్కో టెస్టుకు పరమేశ్వర్ రెడ్డి విముఖత చూపినట్లు తెలుస్తోంది. Read Also: పరీక్షలకు సిద్ధమేనా అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఇప్పుడు సిద్ధంగా లేనని పరమేశ్వర్ రెడ్డి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. గతంలోనూ నార్కోటెస్ట్, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలకు కూడా పరమేశ్వర్ రెడ్డి విముఖత వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి పరీక్షలకు నో చెప్పారు. కేసును త్వరగా తేల్చేందుకు సీరియస్‌గా దృష్టి పెట్టిన సిట్ అధికారులు పరమేశ్వర్ రెడ్డి నో చెప్పడంతో ఆలోచనలో పడ్డారు.

హైదరాబాద్‌లో చంబల్‌ లోయ ముఠా.. పనోళ్లుగా ఇళ్లలో చేరి..

$
0
0
చంబల్ లోయ.. ఈ పేరు వింటేనే గుర్తొచ్చేది, కరడుగట్టిన బందిపోటు దొంగలు. చంబల్ లోయ దొంగలపై తెలుగులో సైతం ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఈ చంబల్ దొంగలు హైదరాబాద్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. సంపన్న వర్గాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే ప్రాంతానికి చెందిన ముకియా ముఠా నగరంలోకి ప్రవేశించింది. గతేడాది డిసెంబర్ 9న బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్ 12లోని ప్రముఖ వ్యాపారి నివాసంలో జరిగిన భారీ చోరీ వెనుక ఈ ముఠా సభ్యుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో నెల రోజుల ముందు పనిలో చేరిన రాంఆశిష్‌ అలియాస్‌ కరణ్‌ ముకియా దాదాపు రూ. 3 కోట్ల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలతో పరారయ్యాడు. అలాగే ఇదే ముఠాకు చెందిన మరికొందరు సభ్యులు కొన్ని ఇళ్లలో పని మనుషులుగా చేరారని.. వారిని పట్టుకొనేందుకు పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. Also Read: పనిలో చేరి.. నమ్మకంగా ఉండి..బిహార్‌లోని సిజోల్‌ ప్రాంతానికి చెందిన రాహుల్‌ ముకియా అలియాస్‌ దహూర్‌ అలియాస్‌ రాజు (33)తో పాటు అతని ముఠాలోని 10 మంది సభ్యులు కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌ వచ్చారు. వారి కంటే ముందు బోలా అనే ముఠా సభ్యుడు పని మనుషులను కుదిర్చిపెడతానని చెప్పి బంజారాహిల్స్‌లోని పలువురు ధనవంతులను మభ్యపెట్టాడు. ఈ నేపథ్యంలోనే రాహుల్‌ ముకియాను బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్ 10లో, రాంఆశిష్‌ ముకియాను రోడ్‌ నంబరు 12లోని కపిల్‌ గుప్తా నివాసంలో పనికి కుదిర్చాడు. మరో 8 మందిని బంజారాహిల్స్‌, బేగంపేట, గోపాలపురం, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌లో పనిలో చేర్చించాడు. ఈ నేపథ్యంలో రాంఆశిష్‌ ముకియా తన ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు శుభకార్యానికి వెళ్లిన సమయంలో అదనుచూసి ఆభరణాలు తస్కరించాడు. అనంతరం రాహుల్‌, రాంఆశిష్‌, పీతాంబర్‌, భగవత్‌ పరారయ్యారు. పోలీసులు బోలాను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. Also Read: ఈ ముఠాది బిహార్‌ చంబల్ లోయలోని మధుబని జిల్లా ప్రాంతం. రాహుల్‌ ముకియాతో పాటు అతని సోదరుడు సురేశ్‌ ముకియా (40) గత పదేళ్లుగా ఈ దందా నడుపుతున్నారు. వీరు దివంగత పూలన్‌ దేవి సంబంధీకులని పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్‌ చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నేరపరిశోధన విభాగం డీఐ రవికుమార్‌, డీఎస్సై భరత్‌భూషణ్‌తో పాటు సిబ్బంది రెండు దఫాలు బిహార్‌ వెళ్లి వచ్చారు. భగవత్‌ను ఇప్పటికే పట్టుకొన్నారు. రాహుల్‌ ముకియా, మరికొందరు దొరకాల్సి ఉంది. బోలాతో పాటు హరిశ్చంద్ర ముకియాను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Also Read:
Viewing all 86453 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>