శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో భారత జవాన్లు - ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్లులో ఇద్దురు జవాన్లు మృతి చెందారు. ఈ దాడిలో మరో నలుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. కుప్పా జిల్లా మరిసేరి గ్రామం సమీపంలో లోని భారత్ - పాక్ సరిహద్దు ప్రాంతంలో శనివారం తెలవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులు భారత్ -పాక్ సరిహద్దుల గుండా భారత్ లోకి చొరబడుతున్నారనే సమాచారం తెలుసుకున్న భారత ఆర్మీ .. అక్కడ భద్రతను పెంచి పహారా కాసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు-జవాన్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆర్మీ ఆస్పత్రికి తరలించాయి. అయితే చికిత్స పొందుతూ ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇదిలా ఉండగా దాడి అనంతరం ఉగ్రమూకలు పరారయ్యారు.
Mobile AppDownload and get updated news