మహాశివరాత్రి... మహాపర్వదినం. ఆ రోజున సూర్యోదయానికి ముందే లేచి తల స్నానం చేయాలి. స్నానం చేశాకే, ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టాలి. పుజ గదిలో ముగ్గు పెట్టి, పూలు చల్లాలి. తెలుపు రంగు దుస్తులు ధరించి, శివుని పటాలు, లింగాకార ప్రతిమలను నీటితో కడిగి, పసుపు, కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు పత్రి, తెలుపు రంగులో పూలతో శివయ్యను అర్చించాలి. అరటిపండు, జామ కాయలతో పాటూ పొంగలి, బూరెలను నైవేద్యంగా పెట్టాలి. పూజ చేసేప్పుడు శివ అష్టోత్తరము, శివపంచాక్షరీ మంత్రములను జపిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఆరోజంతా నిష్ఠతో ఉపవాసం ఉండి శివపురాణము, శివారాధన చేస్తే మరుజన్మ లేక మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు జాగరణ ఉండి శివున్ని స్మరించిన వారిని కైలాస వాసం దక్కుతుందని అంటారు. ఆ రోజున దీపారధనకు నువ్వుల నూనెతో పాటూ అయిదు వత్తులు వేస్తే మంచిది. అలాగే శివరాత్రి రోజున చేసిన దానం కూడా మంచి ఫలితాన్నిస్తుంది.
Mobile AppDownload and get updated news