హైదరాబాద్: సచివాలయంలో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మతో డీజీపీ అనురాగ్ శర్మ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల అంశంపై చర్చ జరిగింది. నిఘా చర్యల్లో భాగంగా నగరంలో మరిన్ని సిసి కెమెరాల ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన కూడళ్లతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో సరిపడ సిసి కెమెరాలు లేనందున అసాంఘీక కార్యకలాపాలు యథేచ్చగా జరుగుతున్నయని..దీన్ని నివారించే క్రమంలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు.
Mobile AppDownload and get updated news