ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో హల్ చల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి కేంద్రం మోసం చేసిందని వారు ఆరోపించారు. సీనియర్ నాయకుడు రఘువీరా నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. వెళుతూ వెళుతూ రఘువీరా తనతో పాటూ ఏపీలోని 13 జిల్లాల మట్టి, నీటిని తీసుకెళ్లారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ దగ్గర వాటిని పెట్టి మట్టి సత్యాగ్రహం చేయనున్నట్టు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం రెండుగంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమవ్వనున్నారు. సాయంత్రం 5గంటలకు శరద్ పవార్ తో భేటీ అవుతారు.
Mobile AppDownload and get updated news