ఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ వ్యాఖ్యలపై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ నోటీసుపై త్వరలో స్పందిస్తానని రాహుల్ అన్నారు. తాను ఈ విషయాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. గతంలో బ్రిటన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ .. తాను బ్రిటీష్ పౌరుడినేనని పేర్కొన్న అంశంపై సమాధానం ఇవ్వాలని లోక్ సభ ఎథిక్స్ కమిటీ జారీ చేసిన నోటీసు నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధక్షుడు ఈ విధంగా స్పందించారు. గత నవంబర్ లో బీజేపీ నేత సుమ్మమణ్యస్వామి ఈ విషయంపై ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అలాగే ఇదే అంశంపై బీజేపీ సభ్యుడు మహేష్ గిరి లోక్ సభ స్పీకర్ ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ విచారణ చేపట్టాల్సిందిగా పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేథప్యంలో పౌరసత్యంపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ రాహుల్ గాంధీకి పార్లెమెంట్ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది.
Mobile AppDownload and get updated news