తెలంగాణ రాష్ట్రంలో స్కూలు పిల్లలకు బడి బాధ తప్పింది. రోజంతా స్కూలులో కూర్చోవాల్సిన అవసరం లేకుండా... ఒంటిపూట బడులు వచ్చేశాయి. ఎండలు బాగా ముదిరిపోవడంతో... నేటి నుంచి స్కూళ్లను ఒంటిపూట నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్ గోపాల్ రెడ్డి తెలిపారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట స్కూళ్లే ఉంటాయని చెప్పారు. అనంతరం ఫైనల్ పరీక్షలు అవుతాయని... వేసవి సెలవులు అమలులోకి వస్తామని తెలిపారు.
Mobile AppDownload and get updated news