తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు బుధవారం ఉదయం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మే 1వ తేదీన జరిగే టెట్ పరీక్షకు అయిదు లక్షల మందిదాగా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం tstet.cgg.gov.in వెబ్సైట్ ను సందర్శించాల్సిందిగా వారు చెప్పారు. కాగా ఏపీ అభ్యర్థులు సైతం తెలంగాణ టెట్ ను రాయొచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఉత్తీర్ణులైన వారిని అనుమతించాలో వద్దో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు.
Mobile AppDownload and get updated news