రూ.కోటి విలువ చేసే కొరియన్ మాస్టిఫ్ భారత్ కు వచ్చేస్తోంది. బెంగలూరుకు చెందిన ఎస్.సతీశ్ అనే కుక్కల ప్రేమికుడు ఈ జాతికి చెందిన రెండున్నర మాసాల వయసున్న కుక్కపిల్లలను చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందుకోసం ఒక్కొక్క కుక్కపిల్లకు ఆయన రూ. కోటి చెల్లించారుట. ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్న సతీశ్ ఎప్పటినుండో ఈ జాతి కుక్కలను దేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొరియన్ మాస్టిఫ్ రకం మనదేశంలో ప్రవేశించడం ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. ముడతలు పడిన శరీరంతో మిగిలిన కుక్కలకు భిన్నంగా ఉండే ఈ జాతి రకం కుక్కలు మనుషులకు ఇట్టే అలవాటైపోవడంతో పాటు చాలా విధేయతతో ఉంటాయని కుక్కల నిపుణులు చెపుతున్నారు. దీనికి గల ఫ్లాట్ ముక్కు దీనికి ప్లస్ పాయింట్. ఎంతటి సూక్ష్మమైన వాసనను అయినా ఇది ఇట్టే పసిగట్టేస్తుందిట. దీని వయసు 7 నుండి పన్నెండేళ్లుండవచ్చు. ఏ ప్రాంతపు వాతావరణానికైనా త్వరగా అలవాటైపోతుంది.
Mobile AppDownload and get updated news