Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85967

కంగనకి మర్యాద ఇస్తున్న పోలీసులు

$
0
0

బాలీవుడ్ నటి, నేషనల్ అవార్డ్ విన్నర్ కంగనా రనౌత్, యాక్టర్ హృతిక్ రోషన్ మధ్య జరుగుతున్న లీగల్ వార్ సంగతి అందరికీ తెలిసిందే. అయితే, హృతిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడు రోజుల్లోగా తమ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కంగనకి, ఆమె సోదరి రంగోలికి సమన్లు జారీ చేసిన ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పుడా సమన్లని ఉపసంహరించుకున్నారు. గతంలో ఆమెని కచ్చితంగా తమ ముందు హాజరుకావాలని డిమాండ్ చేసినట్టుగా ఆ సమన్ల ద్వారా ఆదేశాలు జారీ చేసిన పోలీసులు... ఇప్పుడేమో ఆ సమన్లని ఉపసంహరించుకుంటున్నట్టుగా ఏప్రిల్ 1న ఆమెకి మరో లేఖని పంపించారు. ''మీకు ఎప్పుడు, ఏ తేదీన, ఎక్కడ వీలవుతుందో చెబితే, అప్పుడు ఈ కింది ఆఫీసర్ మిమ్మల్ని కలిసి మీ ఇంటర్వ్యూ తీసుకుని స్టేట్‌మెంట్ రికార్డు చేసుకుంటారు'' అని కోరుతున్నట్టుగా పోలీసులు తన క్లయింట్ కంగనకి ఓ లేఖ పంపించారని లాయర్ రిజ్వాన్ సిద్ధిఖి తెలిపారు. కల్పన, సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సైబర్ పోలీసు స్టేషన్, ముంబై అనే అడ్రస్ నుంచి వచ్చిన ఈ లేఖలో కంగనని ఎంతో మర్యాదపూర్వకంగా ఇంటర్వ్యూకి టైమ్ కోరారు. గతంలో కంగన పట్ల ఎంతో కఠినంగా వ్యవహరిస్తూ సమన్లు జారీ చేసిన పోలీసులని కలిసిన తాను.. తన క్లయింట్ కంగనకి వుండే హక్కుల గురించి వారికి వివరించాను. పోలీసులు సమన్లు జారీ చేసిన విధానం కరెక్ట్ కాదు అని వారికి అర్ధమయ్యేలా చెప్పాను. ఆ తర్వాతే కంగన పట్ల వారి తీరు మారింది అని సిద్ధిఖి అభిప్రాయపడ్డారు.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85967

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>