ఢిల్లీ: బీహార్ ఫలితాలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ ఫలితాలు తమకు చేదు అనుభావాన్ని మిగిల్చిన మాట వాస్తవమేనని కేంద్ర మంత్రి అంగీకరించారు. అయితే ఈ ఫలితాలను దేశం మొత్తానికి ఆపాదించలేమని. మోడీ పాలనకు బీహార్ ఫలితాలు రెఫరెండం అన్న మాటలకు తాను ఏకీభవించనని..దాని ప్రభావం ఆ రాష్ట్రం వరకే ఉంటుదన్నారు. బీహార్ లోని సామాజిక సమీకరణలు విపక్షాలకు కలిసి వచ్చాయని తెలిపారు. బీహార్ ఫలితాలపై ఆత్మపరిలీలన చేసుకొని రానున్న రోజుల్లో మరింత మొరుగుపడతామని కేంద్ర మంత్రి వెంకయనాయుడు వెల్లడించారు.
Mobile AppDownload and get updated news