Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85977

డబ్బుకోసం ఐసిస్ తీవ్రవాద సంస్థ కక్కుర్తి

$
0
0

డబ్బుకోసం ఐసిస్ తీవ్రవాద సంస్థ ఈ మధ్య నానారకాల కక్కుర్తికి పాల్పడుతోంది. మానవత్వానికి మచ్చతెచ్చే పనులు చేస్తోంది. మాయమాటలతో అమాయకులను వలవేసిన తరువాత వారిని మానవ బాంబులుగా మార్చడం, తీవ్రవాదులుగా వివిధ దేశాల్లో దాడులకు పాల్పడేలా చేయడం ఐసిస్ కు నిత్యకృత్యంగా మారింది. ఈ మధ్య కాలంలో అగ్రరాజ్యాలు ఐసిస్ కార్యకలాపాలను ఎక్కడికక్కడ నిర్దాక్షిణ్యంగా అణచివేస్తూ, ఆర్థిక మార్గాలను మూసివేయడంతో ఆ తీవ్రవాద తండాలో డబ్బుకు కటకట మొదలైంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థలో పైశాచిక ఆలోచన ఒకటి అంకురించింది. వివిధ తీవ్రవాద పోరుల్లో గాయపడిన తన సైనికులను చంపి వారి అవయవాలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడం ప్రారంభించిందని ఒక సర్వేలో తెలిసింది.

ఈ వార్త విన్న ప్రపంచం నిర్ఘాంతపోయింది. గాయపడిన ఐసిస్ తీవ్రవాదులను చంపేసి వారి శరీరాల్లోని అవయవాలను బయటకు తీయాలంటూ ఆ సంస్థ కొందరు వైద్యులను ప్రత్యేకంగా నియమించుకుందని అరబిక్ భాషా వార్తా పత్రిక అల్-సబాహ్ వెల్లడించింది. ఇటీవల సైన్యానికి ఐసిస్ కు జరిగిన పోరులో ఆ సంస్థ చేతుల నుండి ఇరాక్ దక్షిణాది ప్రాంతం చేజారిపోయింది. ఆర్థికంగా బాగా కీలకమైన ఆ ప్రాంతం చేజారిపోవడంతో ఐసిస్ లో డబ్బుకు లోటు ఏర్పడింది. దాంతో ఆ సంస్థ, అదే యుద్ధంలో ఇరాకీ సేనల చేతిలో గాయపడి ఓడిపోయి తనకు భారంగా మారిన తీవ్రవాదులను చంపేయాలని నిర్ణయించింది. చంపిన తరువాత వారి శరీరభాగాలను నల్లమార్కెట్లో విక్రయించి ఆదాయం పొందడం ప్రారంభించిందని ఆ వార్తా సంస్థ చెప్పింది. మోసుల్ నగరంలోని ఒక ఆసుపత్రిలో ఏకంగా 183మంది మృతదేహాలు గుట్టగా పడి ఉండటాన్ని ఇటీవల ఒక వ్యక్తి గమనించారు. అవయవాలను సేకరించిన తరువాత మృతదేహాలను ఒకచోట పడవేయడంతో ఆ ఆ శవాలగుట్ట ఏర్పడిందని ఆ ఆసుపత్రిలోని రహస్య సమాచార వర్గాలు తెలిపాయి.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85977

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>