Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85929

కరవు నేలపై రైతన్న దాతృత్వం

$
0
0

కరవుతో అల్లాడిపోతూ గొంతు తడుపుకునేందుకు చుక్క నీరు లభించక అల్లాడిపోతున్న ప్రజలకు ఆ రైతు ఆపద్బాంధవుడిలా మారాడు. తనకు ఉపయోగపడే నీటిని కరవు గ్రామాల రైతులకు దానమిచ్చి అందరి మెప్పు పొందుతున్నాడు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని మాలేగావ్ తాలూకా అత్యంత దారుణమైన నీటి కొరతను ఎదుర్కుంటోంది. ఆ తాలూకాలోని దుంధే, మాలినగర్, జవాయ్వస్తి గ్రామాల్లో నీటి కొరత సమస్య ప్రమాదకరంగా తయారైంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఆ జిల్లాలోని పలు ప్రాంతాలకు నీటిని ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేస్తోంది. మాలేగావ్ తాలూకాలోని గ్రామాలకు కూడా నీటిని ట్యాంకర్ల ద్వారా తరలించేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ తాలూకాకు చుట్టుపక్కల 20-30 కిలోమీటర్లమేర నీరు దొరకని పరిస్థితి నెలకొంది. దాంతో జిల్లా యంత్రాంగానికి ఏమి చేయాలో పాలుపోక తల పట్టుకుంది.

అదే రీజియన్లోని తాహో గ్రామంలో మధుకర్ రౌండాల్ అనే అభ్యుదయరైతు ఆ సమయంలో వారికి రక్షకుడి అవతారమెత్తాడు. మధుకర్ కు 40 ఎకరాల్లో దానిమ్మతోట ఉంది. ఆ తోటలో అతనికి ఒక పెద్ద బావి, చెరువు ఉంది. చుట్టుపక్కల చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో అతని పొలంలో మాత్రం సమృద్ధిగా నీరు అందుబాటులో ఉంది. ముందుచూపు గల మధుకర్ వివిధ రకాల పద్ధతుల్లో తన పొలంలో నీటిని అన్నికాలాల్లో సమృద్ధిగా ఉంచుకునే విధానాన్ని ఎప్పటినుండో అవలంభిస్తున్నాడు. ఇప్పుడా ముందుచూపే వందలాదిమంది గ్రామస్తులకు అక్కరకొచ్చింది. గ్రామస్తులు చుక్కనీటి కోసం అలమటించిపోతున్న పరిస్థితి చూసి చలించిపోయిన మధుకర్ తన పొలంలోని బావి, చెరువులోని నీటిని వాడుకునేందుకు అనుమతించేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చాడు. తన పొలంలోని నీటిని గ్రామస్తులు ఉపయోగించుకోవచ్చని ఇందుకు నయాపైసా కూడా చెల్లించనక్కరలేదని జిల్లా యంత్రాంగానికి తెలియచేసాడు.

సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక తలపట్టుకున్న నాసిక్ ప్రభుత్వ యంత్రాంగానికి మధుకర్ ప్రతిపాదన ఎడారిలో ఒయాసిస్సులా అనిపించి వెంటనే ఒప్పేసుకుంది. ఇప్పుడు వేలాది మంది గ్రామస్తులకు ఆ బావి, చెరువుల్లోని నీరే ప్రాణాధారంగా మారింది. వాటిల్లోని 40వేల లీటర్ల నీటితో గొంతుతడుపుకుంటున్నారు.

అతని 40 ఎకరాల్లోని దానిమ్మతోటకు నీరు చాలా అవసరం. సరిగా నీరు లభించకపోతే దానిమ్మ చెట్లన్నీ ఎండిపోవడం ఖాయం. దీని వల్ల అతనికి పెద్ద ఎత్తున నష్టం వస్తుందని తెలిసికూడా ప్రజల కోసం నష్టపోవడానికి నిర్ణయించుకున్నాడు. కానీ, తోటివారిని ఆదుకోవడంలో గల ఆనందం, ఆత్మ సంతృప్తిని మించి ఏదీ ఇవ్వలేదని మధుకర్ చెప్పిన మాటలు అందరికీ ఆదర్శనీయం.

You can also read this story in Marathi: http://maharashtratimes.indiatimes.com/maharashtra/nashik-north-maharashtra-news/nashik/humanity-works-for-water-shortage-problem/articleshow/52317147.cms

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85929

Trending Articles