రెండోసారి ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణస్వీకారం చేశారు. జయలలిత తన తొలి సంతకాన్ని రైతు రుణమాఫీ ఫైలుపై చేశారు. అలాగే 500 రిటైల్ మద్యం షాపులు మూసివేయాలంటూ ఆదేశించారు. అలాగే మిగతా మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాన్ని కుదించారు. మార్చిన వేళల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉంచాలి. అనేక కొత్త పథకాలను కూడా జయలలిత జూన్ 1 నుంచి అమలులోకి తేనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం, వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు, చేనేత కార్మికులకు 700 యూనిట్లు ఉచితంగా అందించనున్నారు. జయలలితతో పాటూ 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.
Mobile AppDownload and get updated news