Mobile AppDownload and get updated news
పదమూడేళ్లుగా కలిసున్న అవిభక్త కవలలు వీణావాణీలను ఇద్దరిగా విడగొట్టడం వారి ప్రాణానికే ప్రమాదమని ఎయిమ్స్ వైద్యులు తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి భవిష్యత్తులో ఎక్కడ జీవించాలి అన్నదానిపై రెండు మూడు రోజులుగా నీలోఫర్, తెలంగాణా సర్కారు మధ్య చర్చలు నడిచాయి. చివరికి వారినే ఇంటికే పంపించాలని నిర్ణయించింది. కేవలం 12 ఏళ్లలోపు పిల్లల్ని మాత్రమే నీలోఫర్ చూస్తుంది. ఇప్పుడు వీణావాణీల వయసు 13 ఏళ్లు కావడంతో వారిని నిబంధనల ప్రకారం నీలోఫర్ లు ఉంచలేమని వైద్యులు చెప్పేశారు. దీంతో పేద తల్లిదండ్రుల దగ్గరికే వారిని పంపించాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఆర్థికంగా అండగా ఉంటామని స్పష్టం చేసింది. వీణావాణీలు తల్లిదండ్రులు కూలీ పని చేసి బతుకుతున్నారు. వారికి మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారినే చూడడమే కష్టంగా ఉంటే... ఇక వీణావాణీలకు వైద్యం, చదువు, మంచి ఆహారం ఇచ్చే స్థితి వారిది కాదు. అందుకే తమకు కాస్త సమయం కావాలని అడిగారు తల్లిదండ్రులు. వీణావాణీలకు ఇంటికి వెళ్లడం అసలు ఇష్టం లేదు. నీలోఫర్లోనే ఉంటామని వారు పట్టుబడుతున్నారు.