యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుంది. బ్రిటన్ వాసులు ఈయూ నుంచి విడిపోవడానికే మొగ్గు చూపారు. ఈయూలో బ్రిటన్ కొనసాగాలా? వద్దా? అనే విషయం బ్రిటన్ వాసులకు పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఓట్ల లెక్కింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. స్పల్ప ఆధిక్యతతో ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలనే వర్గమే విజయం సాధించింది. బ్రెగ్జిట్ వాదనే గెలిచింది. యూరోపియన్ యూనియన్కు ఇది గట్టి దెబ్బే. 51.6 శాతం బ్రిటన్ వాసులు వైదొలగాలని, 48 శాతం ఓటర్లు వద్దని ఓట్లేశారు. దీంతో ఈయూ నుంచి బ్రిటన్ బయటికి వచ్చేయనుంది. బ్రెగ్జిట్ ఫలితాలు ప్రపంచ మార్కెట్ను భారీగా కుదిపేశాయి. బ్రిటన్ పౌండ్ విలువ కూడా పడిపోయింది. భారత్ స్టాక్ మార్కెట్ భారీగా కుదేలైంది.
Mobile AppDownload and get updated news