ఫుట్బాల్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మెస్సీ.. కోపా అమెరికా శతకోత్సవ టోర్నీ ఫైనల్లో అర్జెంటీనాను గెలిపించుకోలేకపోవడంతో ఏకంగా ఆటకే వీడ్కోలు పలకటం ఫుట్బాల్ ప్రేమికులు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. దీంతో అర్జెంటీనా జట్టులో మెస్సీలేని లోటును పూడ్చడానికి తమ పార్టీకి చెందిన అనుపమ్ ఖేర్ ను నామినేట్ చేయాలని భారతీయ జనతాపార్టీ నిర్ణయించింది. వీర విధేయుడైన ఆయన మాత్రమే ఆ లోటును భర్తీ చేయగలరని కూడా పార్టీ భావిస్తోందట. జట్టులో మెస్సీ చేపట్టిన నిర్వహణ బాధ్యతలు ఈయన కూడా చేయగలరని ఈ నియామకంపై వచ్చిన విమర్శలకు పార్టీ బదులిస్తోంది. ' అర్జెంటీనా టీమ్ మెస్సీ సారథ్యంలో ఎన్నో టోర్నమెంట్లలో విజయం సాధించిందని మీరు అంటున్నారు. అతడు ఇప్పడు టీమ్ లో లేరు. ఆయన స్థానంలో అనుపమ్ ను తీసుకుందామంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ఎన్నో నియమకాలు జరిగాయి. అప్పడు ఎవరూ ప్రశ్నించలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు 'అని బీజేపీ నేత షైనా.. రిపోర్టర్ ను ప్రశ్నించారు. 'భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా ఉన్నట్లే అర్జెంటీనా హాకీ జట్టులో అనుపమ్ ఖేర్ లీడ్ రోల్ ఎందుకు ప్లే చేయకూడదు.'అని ఆమె ప్రశ్నించారు. చివరి నిమిషంలో అనుపమ్ గోల్ చేయడం వల్లే ఓ సారి ఆ జట్టు ఆట గెలిచిందంటూ కొన్ని క్లిప్పింగ్స్ ను చూపించేందుకు ఆమె ప్రయత్నించారు. ప్రతి ఒక్కరిలో ఉన్న నైపుణ్యాలు వెలికి తీసేందుకే ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ స్కిల్ ఇండియా అనే ప్రోగ్రాం కూడా ప్రవేశపెట్టారని ఆమె గుర్తు చేశారు.
Mobile AppDownload and get updated news