స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. శ్రీనగర్లోని నోవొట్ట సీఆర్పీఎఫ్ క్యాంపుపై ముగ్గురు తీవ్రవాదులు సోమవారం ఉదయం కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఐదురుగు భారత జవాన్లకు గాయాలైనట్లు సమాచారం. తీవ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతం చారిత్రక జమ మసీదులో అతి సమీపంలో ఉన్నది. తీవ్రవాదుల మూకుమ్మడి కాల్పులకు భారత జవాన్లు ధీటుగా సమాధానం ఇచ్చారు. శ్రీనగర్ సీఆర్పీఎఫ్ క్యాంపుపై టెర్రరిస్టులు దాడిచేశారన్న సమాచారంతో భారీ బలగాలు మొహరించాయి. ఇంకా కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. సరిహద్దుల్లో భారీ భద్రతను పెంచారు. శ్రీనగర్ బలగాలపై తీవ్రవాదుల కాల్పులు
Mobile AppDownload and get updated news