ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ గురించి మరింత...
-బంగారు పతకం పేరు, ప్రతిష్టలకే...ధరలో దక్కని విలువ
-పూర్తిస్థాయిలో స్వచ్ఛమైన బంగారు పతకాలు చివరిసారిగా 1912 స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో జరిగిన ఒలింపిక్స్ లో విజేతలకు అందజేశారు.
-ఈసారి గోల్డ్ మెడల్స్ సాధించిన హుసేన్ బోల్ట్, మైఖేల్ పెల్ఫ్స్, సైమన్ బైల్స్ సాధించిన 500గ్రాములుండే బంగారు పతకాల్లో 99శాతం వెండి..మిగిలిన 1.2శాతం మాత్రమే బంగారం.
-ప్రస్తుత మార్కెట ధర ప్రకారం అవి కేవలం 587 డాలర్ల విలువ చేస్తాయి.
-'ఒలింపిక్స్ పతకాల తయారీలో భాగస్వాములం కావడం గొప్ప గౌరవం, గొప్ప బాధ్యత' అంటారు బ్రెజిల్ జాతీయ మింట్ విభాగానికి చెందిన విక్టరీ వ్యూగో
-ఈసారి రియో ఒలింపిక్స్ కోసం వివిధ విభాగాల్లో విజేతలకు అందించేందుకు మొత్తం 5,130 పతకాలు రూపొందించారు. ఒక్కో పతకానికి 48 గంటల సమయం పట్టింది. ఇందుకోసం 80మంది రాత్రిబంవళ్లు పనిచేశారు.
-పతకాలకు వాడే వెండి పాత గాజు పలకలు, ఎక్స్ రే పలకల నుంచి సేకరిస్తారు. పాదరసం నుంచి బంగారం తీస్తారు. పాదరసం, ముతక లోహం నుంచి బంగారాన్ని వేరు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే విషవాయువులు వెలువడి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి.
-గ్రీకులు ఆరాధ్యదైవంగా భావించే నైక్ దేవత రెక్కలతో ఒలింపిక్స్ రింగుల కిందికి వాలుతున్నట్లుగా ఉండే ఆకారం ముద్రించడం ఆనవాయితి. మిగతా వైపు ఏ దేశంలో ఒలింపిక్స్ లో నిర్వహిస్తారో ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆకారం ముద్రిస్తారు.
-ప్రతి విజేత గెలుపు కోసం వారి గుండెలపై వాలేలా, మా పనితనం (పతకాలు తయారు చేయడం) నిలిచిపోయేలా 40ఏళ్లుగా వీటి తయారీలో పాల్గొనడం మాకెంతో తృప్తినిస్తోంది అంటారు 40ఏళ్లుగా మింట్ లో పనిచేస్తున్న నెల్సన్.
Mobile AppDownload and get updated news