బ్రెజిల్ లోని రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకాన్ని అందించింది సాక్షి మాలిక్. రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. రియో ఒలింపిక్స్ లో ఇంతవరకూ ఒక్క పతకం కూడా గెలవని భారత్ కు ఆ లోటు లేకుండా చేసింది. ఆమె హర్యానాకు చెందిన అమ్మాయి. తమ ఆడబిడ్డ సాధించిన విజయానికి పులకించిన హర్యానా ప్రభుత్వం సాక్షికి రెండున్నర కోట్ల రూపాయలు నజరానాగా ప్రకటించింది. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని ప్రకటించింది. ఇంతవరకు లైమ్ లైట్ లోకి రాకుండా ఉన్న సాక్షి పేరు... ఒలింపిక్స్ పతకంతో దేశంలో మారుమోగి పోతోంది.
Mobile AppDownload and get updated news