2013లో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన రాజన్ .. దేశంలో ఆర్ధికాభివృద్ధే లక్ష్యమని పేర్కొంటూ లెండింగ్ రేట్లను 7 నుంచి 8 శాతానికి పెంచి 2014 వరకు అవే రేట్లు ఉంచేలా చూశారు. అనంతరం 2015 నుంచి వడ్డీ రేట్లును భారీగా తగ్గించుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి 6.5 శాతం నుంచి 1.5 శాతం మేర తగ్గిస్తూ రాజన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. కాగా రాజన్ తీసుకున్న నిర్ణయాల వల్లే ద్రవ్యోల్పణం పెరుగుతూ వస్తోందని సుబ్రమణ్యస్వామి విమర్శలు సంధిస్తున్నారు. మరికొన్ని వారాల్లో రాజన్ పదవీ కాలం ముగియనుంది. అయినప్పటికీ రాజన్ పై విమర్శల విషయంలో స్వామి వెనక్కి తగ్గకపోవడం విశేషం.
Mobile AppDownload and get updated news