తూ.గో: కాకినాడ సభలో మరణించిన తన అభిమాని కుటుంబానికి పవన్ కల్యాణ్ రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. శనివారం మృతి చెందిన తన అభిమాని కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన పరిహారాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాకినాడలో శుక్రవారం పవన్ కల్యాణ్ సభ జరుగుతున్న సమయంలో ఒక అభిమాని చెట్టుపై నుంచి కిందపడి మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.
Mobile AppDownload and get updated news