Mobile AppDownload and get updated news
కర్నూలు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వెల్దుర్తి మండలం మల్లేపల్లి బస్సు స్టేజి వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో కేరళ రాష్ట్రానికి చెందిన రూబెన్... కేరళ టెక్నో స్కూల్ను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన కుటుంబంతో సహా కేరళ వెళ్లి మక్తల్కు తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో వారు ప్రయాణిస్తున్న కారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మల్లేపల్లి వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో రూబెన్ సహా భార్య బిస్మాల్, తల్లిదండ్రులు ప్రిషియా, దేవిషియా, ఐదు నెలల కుమారుడు, కారు డ్రైవర్ పవన్ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.