ఢిల్లీ: నీట్ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన కొన్ని నిమిషాల్లోనే కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ అంశంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభత్వాల అభ్యర్థన మేరకు నీట్ నుంచి ఏడాది పాటు రాష్ట్రాలకు మినహాయింపు ఇస్తున్నామని.. అయితే ఈ ఏడాది నీట్ ను పరిగణనలోకి తీసుకోవాలా లేదా అనేది రాష్ట్రాల ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉందన్నారు. నీట్ విషయంలో ఢిల్లీ సహా కొన్ని రాష్ట్రాలు అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. అలాంటి రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈ విధంగా స్పందించారు. ఈ సందర్భంగా నడ్డా మట్లాడుతూ వచ్చే ఏడాది కల్లా నీట్ పై చట్టం తీసుకొస్తామని.. ఎట్టిపరిత్తుల్లోనూ 2016-17లో నీట్ ను అమలు చేసి తీరుతామన్నారు. నీట్ పరీక్షలకు ఇప్పటికే 6.5 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారని..జూలై 24 న నీట్ -2 పరీక్ష నిర్వహించనున్నట్లు జేపీ నడ్డా స్పష్టం చేశారు.
Mobile AppDownload and get updated news