ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్ షీట్లు ఉతకటం లేదని, బెడ్ షీట్లను మార్చకుండా రోజుల తరబడి ఒకే బెడ్ షీట్ ఉంచుతున్నారని దీనివల్ల ఇన్ప్ఫెక్షన్స్ ఎక్కువవుతున్నాయని రోగుల బంధువులు, ఇతరుల నుంచి ఇటీవల కాలంలో ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించే దిశగా రోజుకో రంగు బెడ్ షీట్ వాడితే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం భావించింది. వారంలోని ఏడు రోజుల్లో ప్రతీ రోజూ ఒక్కో రంగు బెడ్ షీట్ వాడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. రోజుకో రంగు బెడ్ షీట్లను వాడటం ఇప్పటికే ఎయిమ్స్ పరిధిలోని 19 పెద్ద ఆసుపత్రుల్లో కేంద్ర ఆరోగ్యశాఖ అమలు చేస్తుంది. అయితే అవి జైలు ఉత్పత్తులు కావు. జైలు ఉత్పత్తులను ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం నిజంగా అభినందనీయం.
Mobile AppDownload and get updated news