గుజరాత్ సీఎం ఆనందీ బెన్ లేఖపై బీజేపీ అధ్యక్షుడు స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 75 ఏళ్లు నిండిన వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలనే ఉద్దేశంతోనే తనును పదవి నుంచి తప్పించాలని ఆమె లేఖ రాసిన నట్లు పేర్కొన్నారు. బీజేపీ తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం 75 ఏళ్ల నిండిన వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఉంది. అయితే ఇది వ్యక్తిగత ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంటుందనని పేర్కొంటూ ఆనందీ నిర్ణయం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుందని వ్యాఖ్యనించారు. ఆనందీ బెన్ లేఖపై పార్లమెంట్ బోర్డే తుది నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు.
Mobile AppDownload and get updated news